VIzag: కాంబోడియా ముఠా కబంధ హస్తాల నుంచి విశాఖ యువతకు విముక్తి
మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు.. సైబర్ క్రైమ్ ఏవిధంగా చేయాలో శిక్షణ ఇచ్చారని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు.
విశాఖపట్నం: మానవ అక్రమ రవాణా బాధితులతో చైనా ఏజెంట్లు.. సైబర్ క్రైమ్ ఏవిధంగా చేయాలో శిక్షణ ఇచ్చారని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. వివిధ రకాల స్కామ్స్ చేయించి విశాఖ నుంచే దాదాపు రూ.120 కోట్లు కొల్లగొట్టారని వెల్లడించారు. కాంబోడియా నుంచి విశాఖకు వచ్చిన పది మంది మానవ అక్రమ రవాణా బాధితులకు ఆయన విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులు విశాఖ చేరుకున్నారని సీపీ తెలిపారు.
‘‘స్థానికంగా ఉన్న కొందరు ఏజెంట్లు.. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారు. మన రాష్ట్రంలోని దాదాపు 150 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1.50లక్షలు తీసుకుని కాంబోడియా ఏజెంట్లకు అప్పగించారు. గత ఆరు నెలలుగా వారంతా కాంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నారు. భారతీయులను మోసం చేస్తేనే ఆహారం అందించేవారు. విశాఖ సిటీ పోలీసులు తీసుకున్న చర్యల వల్ల వారిలో ధైర్యం వచ్చింది. బాధితులంతా అక్కడి చైనా అధికారుల ముందు నిరసన వ్యక్తం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ విషయం ఇండియన్ ఎంబసీ దృష్టికి వెళ్లడం, విశాఖ సిటీ పోలీస్ విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడటం జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 10 మంది వచ్చారు. తరువాత ఫ్లైట్లో 18 మంది వస్తున్నారు. కాంబోడియా ముఠా నుంచి తప్పించుకున్న ఓ యువకుడు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి వ్యవహారం వెలుగు చూసింది. బాధితులంతా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు అండగా ఉంటాం’’ అని సీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం