LIC నుంచి ₹2 కోట్లు కొట్టేసేందుకు ‘చావు’ తెలివి.. అక్కడే తప్పులో కాలేశారు!
LIC policy: ఎల్ఐసీని రూ.2కోట్ల మేర మోసగించేందుకు ముంబయిలో ఓ ముఠా యత్నించింది. అందుకోసం పక్కాగా ప్రణాళిక రూపొందించుకుంది. ఆ విషయంలో చేసిన చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కింది.
ముంబయి: బీమా డబ్బుల కోసం మోసాలకు పాల్పడుతున్న ఉదంతాల గురించి మనం వినే ఉంటాం. ఇదే నేపథ్యంతో వచ్చిన కొన్ని సినిమాలూ చూశాం. చనిపోయారని నమ్మించి బీమా కంపెనీలను మోసగించడం ఓ తరహా మోసమైతే.. అమాయకుల ప్రాణాలను బలిగొన్న సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ముంబయిలో మొదటి తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ.2 కోట్ల మేర ఎల్ఐసీని మోసగించేందుకు యత్నించిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ మొత్తానికి పాలసీ తీసుకోవడం మొదలు.. దాన్ని క్లెయిమ్ చేయడం వరకు ఎక్కడా అనుమానం రాకుండా స్కెచ్ వేసినప్పటికీ.. ఆ ఒక్క విషయంలో పొరపాటు వీరిని కటకటాల పాల్జేసింది.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన దినేశ్ టక్సలే (29) ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా ఎల్ఐసీ పాలసీ (LIC Policy) తీసుకున్నాడు. రూ.5 కోట్లు, రూ.3 కోట్లు విలువైన పాలసీల కోసం దరఖాస్తు చేశాడు. ఇందుకోసం నకిలీ ఆదాయ ధ్రువ పత్రాలను సృష్టించాడు. ఏటా తనకు వ్యవసాయంపై రూ.38 లక్షలు, మెస్ నడపడం ద్వారా మరో రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని పేర్కొన్నాడు. దీంతో 2015 జులై 5న దరఖాస్తును ఆమోదించిన ఎల్ఐసీ.. రూ.2 కోట్ల మొత్తానికి 35 ఏళ్లకు గానూ పాలసీ జారీ చేసింది. ఇందుకోసం తొలి ప్రీమియంగా రూ.1.46 లక్షలు దినేశ్ చెల్లించాడు.
2017 మార్చి 14న దినేశ్ తల్లిగా పేర్కొంటూ నందా భాయ్ టక్సలే అనే మహిళ ఎల్ఐసీ దాదార్ బ్రాంచ్ను ఆశ్రయించింది. తన కుమారుడు 2016 డిసెంబర్ 25న రోడ్డు ప్రమాదంలో మరణించాడని క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో అనుమానం వచ్చిన ఎల్ఐసీ అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. పాలసీ కోసం సమర్పించిన డాక్యుమెంట్లు సహా మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా అనుమానస్పదంగా ఉండడంతో 2023 ఫిబ్రవరి 21న ఎల్ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు దినేశ్ను పట్టుకున్నారు. ఈ మోసంలో అతడికి సహకరించిన అతడి ఇద్దరి స్నేహితుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు.
దాచుకున్న డబ్బులన్నీ ప్రీమియంకే
ఇంజినీరింగ్ డిప్లోమా పూర్తి చేసిన దినేశ్.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. తక్కువ ఆదాయం వస్తుండడంతో ఏదైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఎల్ఐసీని మోసం చేయాలని నిర్ణయానికి వచ్చాడు. ఇందుకోసం తన ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్నాడు. తొలుత రూ.8 కోట్ల బీమా కోసం ప్రయత్నించాడు. రూ.2కోట్లకే బీమా ఇవ్వడంతో తను దాచుకున్న రూ.5 లక్షలను ప్రీమియం రూపంలో చెల్లించారు. ఇందుకోసం నకిలీ ఆదాయ ధ్రువపత్రాలను సృష్టించారు.
పక్కా ప్లాన్.. అక్కడే దొరికేశారు!
తీరా దినేశ్ పేరిట పాలసీ దొరికాక.. దాదాపు ఏడాది పాటు వారు సైలెంట్గా ఉన్నారు. ఏడాది తర్వాత ఓ గుర్తుతెలీని శవం కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు 2016 డిసెంబర్లో ఓ శవాన్ని సంపాదించారు. అహ్మద్నగర్లోని ఆస్పత్రికి వెళ్లి ఆ మృతదేహం తన కుమారుడు దినేశ్దేనంటూ వృద్ధ దంపతులు వైద్యులకు చెప్పారు. దీంతో పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. వారు దాన్ని తీసుకెళ్లి దహనక్రియలు నిర్వహించారు. దినేశ్ పేరిట మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించాక ఎల్ఐసీని ఆశ్రయించారు. అయితే డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ.. తక్కువ టైమ్లో పాలసీ క్లెయిమ్కు రావడంతో ఎల్ఐసీ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు విచారణ చేపట్టడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దినేశ్ బతికే ఉన్నాడని తెలీడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. అయితే, ఆస్పత్రిలో వీరికి సహకరించింది ఎవరు? ఆస్పత్రి వద్దకు వెళ్లిన ఆ వృద్ధ జంట ఎవరు? ఇంతకీ ఆ మరణించిన వ్యక్తి ఎవరు? ఈ వ్యవహారంతో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం