East Godavari: టైరు పేలి మరో కారును ఢీకొన్న కారు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Updated : 02 Jan 2024 17:44 IST

దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ కారు దేవరపల్లి మండలం జాతీయ రహదారి బంధపురం వద్దకు రాగానే కారు టైరు పేలి.. డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారుపైకి వేగంగా దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగిన సమయంలో రెండు కార్లలో కలిపి 11 మంది ప్రయాణిస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. వారిలో సుభాష్‌ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని