Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్.. దాడుల కోసం తిరుపతన్న ప్రత్యేక టీమ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న వాంగ్మూలం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ఎస్ఐబీ ఐజీ ప్రభాకర్రావు, అదనపు ఎస్పీ భుజంగరావు ఆదేశాలతోనే తాను దాడులకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తిరుపతన్న పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ఆయన చెప్పిన వివరాలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో జరిగిన మూడు ఉపఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుపతన్న బృందం కీలకంగా పనిచేసింది.
‘‘భారాస పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడ రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నాం. కాంగ్రెస్, భాజపా పార్టీలకు డబ్బు చేరకుండా అడ్డుకట్ట వేశాం. దీని కోసం ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసుకున్నాం. POL-2023 పేరుతో ప్రత్యేక ఎన్నికల వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతోనే 15 ఆపరేషన్లు, మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, భాజపా సానుభూతిపరుల డబ్బులను సీజ్ చేశాం.
ప్రస్తుత మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్లకు చెందిన డబ్బులను స్వాధీనం చేసుకున్నాం. రాఘవ ఇన్ఫ్రా సంస్థకు చెందిన రూ.10.5 కోట్లు, ఎమ్మెల్యే వినోద్కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన రూ.50.45 లక్షల నగదును స్వాధీనపరుచుకున్నాం. కామారెడ్డి ఉపఎన్నిక కోసం ప్రత్యేక బృందాన్ని నియమించుకున్నాం. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు భాజపా నేత వెంకటరమణారెడ్డిపై నిఘా పెట్టాం. మొత్తం 300 మంది సెల్ఫోన్లను ట్యాప్ చేశాం. తద్వారా సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించాం. కొల్లూరులో రేవంత్రెడ్డి మిత్రుడు గాలి అనిల్కుమార్ నుంచి రూ.90 లక్షలు, కె.వినయ్రెడ్డి దగ్గర రూ.1.99 కోట్లు, రాజగోపాల్రెడ్డి అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు, ఉత్తమ్ సహచరుడు గిరిధర్ నుంచి రూ.35 లక్షలు, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ. 90 లక్షలు స్వాధీనం చేసుకున్నాం’’ అని తిరుపతన్న తన వాంగ్మూలంలో వెల్లడించినట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్