Hyderabad: పారాగ్లైడింగ్‌ చేస్తూ హైదరాబాద్‌ టూరిస్టు మృతి

పారాగ్లైడింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ హైదరాబాద్‌కు చెందిన ఓ టూరిస్టు మృతి చెందారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. 

Updated : 12 Feb 2024 09:47 IST

కులూ: హైదరాబాద్‌కు చెందిన ఓ టూరిస్టు పారాగ్లైడింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో చోటుచేసుకుంది. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్‌ పైలట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకుండానే అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా. 

కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైన శర్మ ఈ ఘటనపై స్పందించారు. మానవ తప్పిదమే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పారాగ్లైడింగ్‌ చేసిన ప్రదేశం, ఎక్విప్‌మెంట్‌కు అనుమతి ఉందని, పైలట్‌కు రిజిస్ట్రేషన్‌ ఉందన్నారు. వాతావరణ సమస్యలు సైతం లేవన్నారు. ఈ ప్రమాదంతో ప్రస్తుతం అక్కడ పారాగ్లైడింగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 336, 334 కింద పైలట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారిణి చెప్పారు. మృతిచెందిన టూరిస్టు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని