Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..12 మంది మృతి

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని (Uttar Pradesh) షాజహాన్‌పూర్‌లో ఓ వంతెన పై నుంచి ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కల్పోగా పలువురికి గాయాలయ్యాయి.

Published : 15 Apr 2023 18:56 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నీళ్లు తీసుకురావడానికి 30 మందితో వంతెనపై వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. బాధితులంతా అజ్మత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని  షాజహాన్‌పూర్‌ ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయాలపాలైన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని