Train Accident: ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. పలువురి దుర్మరణం!

ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను రైలు ఢీకొట్టింది.

Updated : 28 Feb 2024 22:38 IST

రాంచీ: ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం (Jharkhand Train Accident) చోటుచేసుకుంది.  రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ రైలు  (12254) ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు జంతారా సబ్‌ డివిజనల్‌ పోలీస్ అధికారి తెలిపారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 140 కిలోమీటర్ల దూరంలో కల్జారియా సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి వైద్య బృందాలను, అంబులెన్స్‌లను తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని