Crime News: కెమెరా కోసం ఇంత దారుణమా?.. ఫొటోగ్రాఫర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
విశాఖకు చెందిన యువ ఫొటోగ్రాఫర్ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది.
రావులపాలెం: విశాఖకు చెందిన యువ ఫొటోగ్రాఫర్ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలువైన కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. విశాఖ మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్ (23) వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. పెళ్లి వేడుకలకు ఫొటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఆన్లైన్ ద్వారా బుకింగ్లు తీసుకొని దూర ప్రాంతాల ఈవెంట్లకూ వెళ్తుంటాడు.
ఈ క్రమంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఫొటోషూట్ ఉందని ఫోన్ చేసి రమ్మన్నారు. దీంతో ఫిబ్రవరి 26న సాయికుమార్ తన వద్ద ఉన్న కెమెరా, సామగ్రి తీసుకొని రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత ఇద్దరు యువకులు కారులో వచ్చి సాయిని తీసుకెళ్లారు. పథకం ప్రకారం.. రావులపాలెం సమీపంలోకి వెళ్లిన తర్వాత చంపేశారు. మృతదేహాన్ని కడియంలంకలో పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా, సామగ్రి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మూడు రోజులు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గత నెల 29న విశాఖలోని పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడి ఫోన్ కాల్డేటా ఆధారంగా కడియంకు చెందిన షణ్ముఖతేజను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. కెమెరా కోసమే మూలస్థానం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి సాయిని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని కడియంలంకలో పూడ్చిపెట్టినట్టు చెప్పడంతో ఆదివారం వెలికితీశారు. రూ.10 లక్షల విలువైన కెమెరా కోసమే ఫొటోగ్రాఫర్ను హత్యచేశారని, అన్ని ఆధారాలు సేకరించి.. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి