Suicide: కోట్లలో అప్పులు చేసిన భర్త.. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
అప్పుగా తీసుకున్న కోటి రూపాయలను భర్త క్రికెట్ బెట్టింగ్లో కోల్పోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
బెంగళూరు: అప్పుగా తీసుకున్న కోటి రూపాయలను భర్త క్రికెట్ బెట్టింగ్లో కోల్పోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్రదుర్గ ప్రాంతంలో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ దర్శన్ 2021 నుంచి టీ20 క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. క్రికెట్ మ్యాచ్లపై పందేలు కాసేందుకు రూ.1.5 కోట్లకు పైగా అప్పులు చేశాడు. అనంతరం కోటి రూపాయలు తిరిగి చెల్లించాడు. మరో 84 లక్షల రూపాయల రుణం తీర్చాల్సి ఉంది. ఈ సందర్భంగా తరుచూ అప్పుల వాళ్లు తమ డబ్బులు చెల్లించమని గొడవ చేసేవారు. వారి వేధింపులతో విసిగిపోయిన అతని భార్య రంజిత(23) ఆత్మహత్యకు పాల్పడింది.
వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బును అప్పుగా ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను ఫిర్యాదులో చేర్చాడు. తన అల్లుడికి బెట్టింగ్ అంటే ఇష్టం లేదని అప్పు ఇచ్చిన వారే డబ్బు ఆశ చూపి అతనిని బలవంతంగా ఇందులోకి దింపారని వాపోయాడు. మృతురాలి వద్ద పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె వడ్డీ వ్యాపారులు తమను తీవ్రంగా వేధించారని అవి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నారు. దర్శన్, రంజితలకు 2020లో వివాహం కాగా వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?