Siddipet: మేనమామ చేతిలో హతమైన మూడేళ్ల చిన్నారి

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ హతమార్చిన ఘటన నంగునూర్‌ మండలం బద్దిపడగ గ్రామంలో జరిగింది.

Updated : 24 Feb 2024 20:31 IST

నంగునూర్‌: సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి మతిస్థిమితం లేని మేనమామ చేతిలో హతమైన ఘటన నంగునూర్‌ మండలం బద్దిపడగ గ్రామంలో జరిగింది. శిరీష (3) తల్లి సంతోషితో కలిసి గ్రామంలోని పొలానికి వెళ్లింది. తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న శిరీషను ఆమె మేనమామ శ్రీనివాస్‌ బురదలో తొక్కి హతమార్చాడు.   ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని