Bride: గాల్లోకి కాల్పులు జరిపిన వధువు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఉత్తర్ప్రదేశ్ (Uttar pradesh)లో జరిగిన ఓ పెళ్లివేడుకలో వధువు (Bride) గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు ప్రస్తుతం పరారీలో ఉంది.
లఖ్నవూ: పెళ్లి.. జీవితంలో ఒకేఒక్కసారి జరిగే సంతోషకరమైన వేడుక. ఈ సందర్భం ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమే. అయితే, కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఉత్తర్ప్రదేశ్ (UttarPradesh) లోని హత్రాస్ (Hatras)లో ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి మండపంలో ఓ వధువు రివాల్వర్ (Revolver)తో 5 సెకెన్ల వ్యవధిలో గాల్లోకి 4 రౌండ్ల కాల్పులు జరిపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు వధువుపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
హత్రాస్లోని సాలెంపూర్లో శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుక జరిగింది. వధూవరులిద్దరూ దండలు మార్చుకున్న తర్వాత ఓ వ్యక్తి వేదిక మీదకు వచ్చి.. కొద్దిసేపు నిల్చున్నాడు. ఆ తర్వాత లోడ్ చేసి ఉన్న రివాల్వర్ను పెళ్లికూతురు చేతికిచ్చాడు. ఆమె నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపింది. ఆ తర్వాత రివాల్వర్ను మళ్లీ అతడికి ఇచ్చేసింది. ఆ పక్కనే ఉన్న వరుడు మాత్రం బిక్కమొహం వేసుకొని కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. గన్ ఇచ్చిన వ్యక్తి వధువు తరఫు బంధువై ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు తరఫు బంధువులను త్వరలోనే విచారిస్తామని ఏఎస్పీ అశోక్కుమార్ తెలిపారు.
ఉత్తరభారతంలో పెళ్లి సందర్భంగా గాల్లోకి కాల్పులు జరపడం కొత్తేం కాదు. అయితే, తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో డిసెంబర్ 2019లో కేంద్రం ఆయుధ చట్టాన్ని సవరించింది. బహిరంగ సభలు, మతపరమైన స్థలాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో లైసెన్స్ ఉన్న తుపాకులు సైతం వాడటం నేరమని పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే రెండేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మరోవైపు వేడుకల్లో తుపాకుల వినియోగంపై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా.. సమాచారం ఆధారంగా కేసు నమోదు చేయొచ్చని 2016లోనే లఖ్నవూ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి