Uttar pradesh : తాగుబోతుకు 38 చెప్పుదెబ్బలు.. యూపీ పోలీసు సస్పెన్షన్
యూపీలోని ఓ (Uttar pradesh) మార్కెట్లో వీరంగం సృష్టిస్తున్న తాగుబోతును పోలీసు 38 సార్లు చెప్పుతో కొట్టాడు. దాంతో ఉన్నతాధికారులు పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశారు.
Image : Up police
లఖ్నవూ : ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడనే నెపంతో ఓ తాగుబోతును సివిల్ దుస్తుల్లో ఉన్న ఓ పోలీసు 38 సార్లు చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఉన్నతాధికారులు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని (Uttar pradesh) హర్దోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దినేశ్ అనే పోలీసు సివిల్ డ్రెస్లో సమీపంలోని మార్కెట్కు వెళ్లాడు. ఓ వ్యక్తి తప్పతాగి ఆ పరిసరాల్లోని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడనే విషయం అతడి దృష్టికి వచ్చింది. తాగుబోతును వారించే ప్రయత్నం చేయగా.. దినేశ్పైనే తిరగబడ్డాడు. దాంతో ఆగ్రహించిన పోలీస్ తన చెప్పు తీసుకొని అదే పనిగా 38 సార్లు కొట్టాడు.
ఈ ఘటనపై అదనపు ఎస్పీ దుర్గేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. కానిస్టేబుల్ సివిల్ దుస్తుల్లో సమీపంలోని మార్కెట్కు వెళ్లాడు. ఓ వ్యక్తి ఫూటుగా మద్యం తాగి ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించాడు. అతడిని అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పైనా తిరగబడ్డాడు. దాంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో దూకుడు ప్రదర్శించిన పోలీసును వెంటనే సస్పెండ్ చేశామని’ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి