kidnap drama : లవర్తో వెళ్లిపోయి.. డబ్బుల కోసం తండ్రికి ఫోన్ చేసి కిడ్నాప్ డ్రామా ఆడి..
యూపీకి (Uttar pradesh) చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి జీవించేందుకు సరికొత్త ఎత్తగడ వేసింది. తాను అపహరణకు గురయ్యానని నాటకమాడింది.
లఖ్నవూ : ఇంట్లో నుంచి పారిపోయిన ఓ యువతి ప్రియుడితో కలిసి జీవించేందుకు డబ్బులు లేకపోవడంతో ఓ సరికొత్త నాటకానికి తెరలేపింది. తనను కిడ్నాప్ చేశారని, రూ.10 లక్షలు చెల్లించి విడిపించాలని కోరుతూ తండ్రికి వీడియో సందేశం పంపించింది. ఉత్తరప్రదేశ్లోని (Uttar pradesh) కాన్పూర్లో ఈ వింత ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్మ అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. ఈ నెల 4న ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయింది. వారిద్దరూ కలిసి ఓ హోటల్లో అద్దెకు దిగారు. జీవితాంతం కలిసి బతికేందుకు కావాల్సినంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో కిడ్నాప్ డ్రామా ఆడాలని వారు నిర్ణయించుకున్నారు.
జలపాతంలో పడిపోయిన కారు.. అందులో 12ఏళ్ల బాలిక!
పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ యువతిని కట్టేసి ఉంచిన వీడియోను తండ్రి వర్మకు పంపారు. ఆమెను కిడ్నాప్ చేశామని, రూ.10 లక్షలు ఇచ్చి విడిపించుకోవాలని అందులో డిమాండ్ చేశారు. వీడియోలో యువతి అరుస్తూ.. తనను కాపాడమని వేడుకుంది. దాంతో కంగారు పడిపోయిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని మొబైల్ లొకేషన్ ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసుల వెతుకులాట ప్రారంభించగా.. ఆ ఇద్దరూ ఓ హోటల్ గదిలో కనిపించారు. మే 22వ తేదీనే వారు పెళ్లి కూడా చేసుకున్నట్లు పోలీసులకు తెలియడంతో ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన వివాహ ధ్రువీకరణ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. తగినంత డబ్బు లేకపోవడంతోనే ఈ కిడ్నాప్ నాటకం ఆడారని పోలీసులు నిర్ధారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.