రూ.300 విలువైన ఆభరణాలు రూ.6కోట్లకు.. అమెరికా మహిళకు టోకరా!
అమెరికాకు చెందిన ఓ మహిళను నిట్టనిలువునా ముంచేశాడు జైపుర్కు చెందిన వ్యాపారి. కేవలం రూ.300 విలువ చేసే నగల్ని రూ.6 కోట్లకు విక్రయించాడు.
ఇంటర్నెట్డెస్క్: నాణ్యమైన బంగారంతో చేసిన ఆభరణాలంటూ అమెరికాకు చెందిన ఓ మహిళను నమ్మించాడు ఓ నగల వ్యాపారి. మాయ మాటలు చెప్పి వాటిని కొనేలా ప్రేరేపించాడు. అలా కేవలం రూ.300 విలువ చేసే ఆభరణాలను రూ.6 కోట్లకు అంటగట్టాడు. రెండేళ్ల తర్వాత ఈ విషయం తెలియడంతో సదరు మహిళ షాక్ అయ్యారు.
అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ రెండేళ్ల క్రితం జైపుర్లోని ఓ నగల దుకాణంలో ఆభరణాన్ని కొనుగోలు చేశారు. వాటి కోసం ఏకంగా రూ.6కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్న ఆభరణాల్ని అమెరికాలోని ఓ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రమంలో నకిలీవి అని తెలియడంతో ఆమె కంగుతిన్నారు. కొనుగోలు చేసే సమయంలో బంగారం స్వచ్ఛతను చూపించే హాల్మార్క్ సర్టిఫికెట్ ఉండటంతో ఆమెకు ఎటువంటి సందేహమూ రాలేదు. నిజం తెలిసిన వెంటనే ఆ మహిళ జైపుర్కి వచ్చి జ్యువెలరీని తనకు విక్రయించిన వ్యాపారిపై ఫిర్యాదు చేశారు.
నగల షాపు యజమాని ఆమె మాటల్ని తప్పుబట్టాడు. ఆ మహిళే తన దుకాణంలోని బంగారంతో పారిపోయిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించడంతో పాటు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆమె జైపుర్ పోలీసులను అభ్యర్థించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ జ్యువెలరీలో పొదిగిన వజ్రాలు నకిలీవని.. 14 క్యారెట్లు ఉండాల్సిన బంగారం కేవలం 2 క్యారెట్లు ఉందని తెలిపారు. నగల వ్యాపారం చేస్తున్న గౌరవ్ సోనీ, రాజేంద్ర సోనీ ఇద్దరినీ నిందితులుగా తేల్చారు. అయితే నకిలీ హాల్మార్క్ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వీరిద్దరూ కోట్లలో మోసం చేశారంటూ అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్నాడు. -
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ జరిగింది. మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. -
ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి!
తల్లిదండ్రులు ఆగస్టులో తమ పెద్ద కొడుకు పెళ్లి చేద్దామనుకున్నారు. అంతలోపే విధి చెట్టు రూపంలో కాటేసి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి మీద పడడంతో యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు
అక్రమంగా చిట్టీలు నడుపుతూ.. గడువు ముగిసినా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన కేసులో పోలీసులు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ఆమె భర్తను అరెస్టు చేశారు. గురువారం హసన్పర్తి ఠాణాలో ఎస్సై దేవేందర్తో కలిసి సీఐ జె.సురేశ్ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. -
మల ద్వారంలోకి గాలి పంపింగ్.. యువకుడి పరిస్థితి విషమం
స్నేహితుల సరదా ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. మెకానిక్ షెడ్డు వద్ద మల ద్వారంలోకి గాలి పంపింగ్ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
ములుగు-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. -
బాలుడిని బలిగొన్న టైరు.. ఓఆర్ఆర్పై మూత్రవిసర్జన చేస్తుండగా ఘటన
అవుటర్ రింగు రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ప్రభుత్వాధికారులు
లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కారు ఇద్దరు ప్రభుత్వాధికారులు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన లడె రాజేశ్వర్రావు పేరిట ఉన్న 1,173 చదరపు గజాల స్థలం ఉంది. -
గ్యాస్ లీకై.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం
ప్రయాణికులతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. -
మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు
సభ్యసమాజం తలదించుకునేలా ఓ గిరిజన మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చితకబాదిన సంఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో చోటుచేసుకుంది. -
వినుకొండ హత్యకేసులో మరో ఆరుగురి అరెస్టు
పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రషీద్ హత్యకేసులో మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టుచేశారు. వినుకొండ పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. -
తుపాకీ గురిపెట్టి బాలికపై అత్యాచారం!
దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి తుపాకీ గురిపెట్టి ఓ బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఐదంతస్తుల భవనంపై నుంచి తోసేశాడు. -
కారు దిగి నడుస్తూ వెళ్లి.. ‘అటల్ సేతు’ పైనుంచి దూకేసిన టెకీ.. వీడియో
కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఓ టెకీ.. ముంబయిలోని అటల్ సేతు పైనుంచి కిందకు దూకేశాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి నీరిచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి