Gangster Son Encounter: ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నాం కానీ..! ఎన్కౌంటర్పై కీలక విషయాలు
గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్(Gangster Atiq Ahmed)కుమారుడు అసద్.. యూపీ పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించాడు. ఈ ఎన్కౌంటర్కు ముందు నెలకొన్న పరిస్థితులను పోలీసులు వెల్లడించారు.
లఖ్నవూ: గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్(Gangster-politician Atiq Ahmed) కుమారుడు అసద్, మరో నిందితుడు గులామ్.. ఉత్తర్ప్రదేశ్ పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమవడం సంచలనం సృష్టించింది. అయితే ఎదురుకాల్పులు జరిగిన వెంటనే దాఖలైన ఎఫ్ఐఆర్లో పోలీసులు(Uttar Pradesh police) కీలక విషయాలు వెల్లడించారు.
‘ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై పారిపోతున్నారని, వారి వాహనాలను ఓవర్టేక్ చేయాలని మా డ్రైవర్కు సూచించాం. లొంగిపోవాలంటూ నిందితులకు వినిపించేలా గట్టిగా చెప్పాం. కానీ వారు వేగం పెంచి, పారిపోయేందుకే యత్నించారు. ఇంతలో మరో బృందం వారిని చుట్టుముట్టింది. వారు పారిపోయే క్రమంలో జారి కిందపడిపోయారు. ఆ తర్వాత మా సిబ్బందిని దూషించడం ప్రారంభించారు. మాపై కాల్పులు జరిపారు. మా ప్రాణాల గురించి పట్టించుకోకుండా వారిని సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ వారు ఇష్టారీతిగా కాల్పులు జరపడంతో మేం కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. తర్వాత వారివైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. వారు గాయపడి ఉన్నారు. వారిలో ఇంకా చలనం ఉండటంతో వెంటనే ఇద్దరిని చెరొక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించాం. కానీ తర్వాత వారు చనిపోయారని తెలిసింది. పిస్తోళ్లు, బుల్లెట్ షెల్స్, లైవ్ బుల్లెట్లు, ద్విచక్రవాహనాలు సహా మరికొన్ని ఆధారాలను ఘటనా ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్నాం’ అని ఎఫ్ఐఆర్(FIR)లో పోలీసులు తెలిపారు.
అతీక్ గ్యాంగ్లోని ఓ వ్యక్తి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులకు అసద్, గులామ్ జాడ తెలిసింది. 2005లో బీస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అతీక్ అహ్మద్(Gangster Atiq Ahmed) ప్రధాన నిందితుడు. ప్రధాన సాక్షి అయిన న్యాయవాది ఉమేశ్ పాల్ 2006లో అపహరణకు గురై విడుదలయ్యారు. అతీక్తో పాటు మరికొందరిపై 2007లో ఉమేశ్ కేసు పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్లోని ధూమన్గంజ్ ప్రాంతంలోని ఉమేశ్ ఇంటి వద్ద ఆయనతోపాటు ఇద్దరు అంగరక్షకులను దుండగులు కాల్చి చంపారు. అప్పటి నుంచి అసద్, గులామ్ అదృశ్యమయ్యారు.
అతీక్ను తరలిస్తోన్న కాన్వాయ్పై దాడికి పన్నాగం..!
మృతులు అసద్, గులామ్.. గ్యాంగ్స్టర్ అతీక్( Atiq Ahmed)ను కోర్టుకు తరలిస్తోన్న కాన్వాయ్పై దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వారి ప్రణాళిక ప్రకారం అతీక్ను విడిపించడం వారి లక్ష్యం కాదని చెప్పాయి. ఈ కేసును సంచలనం చేసి, యూపీ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేసేందుకు కాన్వాయ్పై కొన్ని రౌండ్ల కాల్పులు జరపాలని వారు భావించినట్లు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.