Road Accident: రోడ్డుపై ట్రక్కు బీభత్సం.. వీడియో వైరల్‌

హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని సిమ్లా (Shimla) జిల్లా చైలా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

Published : 09 Aug 2023 13:25 IST

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఆపిల్‌ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడే ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సిమ్లా (Shimla) జిల్లా చైలా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నార్కండ్‌ నుంచి యాపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్కు రాజ్‌ఘర్‌ -సోలన్‌ రహదారి గుండా బయటకు వచ్చే క్రమంలో సైన్జ్‌-రాజ్‌ఘర్‌ రహదారి వైపు వెళ్లబోయి.. సిమ్లా జిల్లా చైలా రోడ్డులోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ట్రక్కు బ్రేకులు పెయిల్‌ కావడంతో రోడ్డు పక్కనే ఉన్న కార్లపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదు కార్లు ధ్వంసం అయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు