Atiq Ahmad: ఎవరీ గుడ్డూ..?అతీక్ సోదరుడి చివరి మాట అతడి పేరే..!
అతీక్ అహ్మద్ ప్రధాన అనుచరుడు గుడ్డూ కోసం ఇప్పుడు పోలీసుల వేట తీవ్రమైంది. బాంబుల తయారీలో మొత్తం యూపీలోనే అతడిని మించినవాడు లేడని పేరుంది.
ఇంటర్నెట్డెస్క్: హత్యకు ఒక్క క్షణం ముందు గ్యాంగ్స్టర్ అతీక్ సోదరుడు అష్రాఫ్ తమ ప్రధాన బాంబ్స్పెషలిస్టు గురించి ఏదో ప్రస్తావిస్తూ.. ‘‘అసలు విషయం ఏమిటంటే.. గుడ్డూముస్లిం’’ అని ఏదో చెప్పబోయాడు. అదే సమయంలో అత్యంత సమీపం నుంచి హంతకులు అతీక్ను కాల్చేశారు. అష్రాఫ్ ఆ షాక్ నుంచి తేరుకొనేలోపే.. అతడిపై కూడా తూటాల వర్షం కురిసింది. దీంతో అతీక్ సోదరులిద్దరూ అచేతనంగా నేలపై పడిపోయారు. వారు ఏం చెప్పబోతున్నారు.. అసలా బాంబుస్పెషలిస్టు గుడ్డూ ఎవరూ అనే అంశంపై ఇప్పుడు చర్చజరుగుతోంది. ఉమేశ్పాల్ హత్య కేసు నిందితుల జాబితాలో అతడి పేరు ఉంది.
చిన్న కేసుల నుంచి..
1990ల్లో గుడ్డూ ప్రయాగ్రాజ్లో మెల్లగా పాపులారిటీ సంపాదించడం మొదలుపెట్టాడని 1977 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ఒకప్పటి యూపీ డీజీ బ్రిజ్లాల్ పేర్కొన్నారు. అతడు పాఠశాల విద్యను అభ్యసించే సమయంలో పశ్చిమబెంగాల్ వెళ్లి అక్కడ బాంబుల తయారీ, వాటి వినియోగం నేర్చుకొని వచ్చాడు. అందరూ అతడిని గుడ్డూ బంబాజ్ అని కూడా పిలిచేవారు. నాటు బాంబులు తయారీలో సిద్ధహస్తుడు. బైక్పై ప్రయాణిస్తూ లేదా పరిగెడుతూ కూడా అప్పటికప్పుడు నిమిషంలో నాటు బాంబు తయారు చేసి ప్రయోగించగలడు. అతడి వద్ద ఎప్పుడూ బాంబు తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉండేదని మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయమే అతడిని యూపీ గ్యాంగ్స్టర్ల సర్కిల్లో బాగా పాపులర్ చేసింది. ఒక్కసారి బాంబు నిపుణుడిగా పేరువచ్చాక గుడ్డూ ఈ నేరసామ్రాజ్యంలో వెనుదిరిగి చూడలేదు.
వ్యాయామ శిక్షకుడి హత్యతో..
వాస్తవానికి గుడ్డూ నేరప్రస్థానం 1977లో మొదలైంది. ఆ ఏడాది గుడ్డూను అతడి తండ్రి లఖ్నవూ యూనివర్శిటీలో చేర్పించారు. లా మార్టినియర్ కాలేజీలో ఫెడ్రిక్ గోమేస్ అనే పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) శిక్షకుడిని హత్య చేశాడు. పోలీసులు ఈ కేసు నేరనిరూపణలో విఫలమయ్యారు. ఆ తర్వాత గుడ్డూ అప్పట్లో ఫైజాబాద్లోని సత్యేంద్ర సింగ్ అనే హిస్టరీ షీటర్ గ్యాంగ్లో చేరాడు. 1996లో శ్రీప్రకాశ్ శుక్లాతో జరిగిన ఓ గ్యాంగ్వార్లో సత్యేంద్ర హతమయ్యాడు. శుక్లాతో కూడా కలిసి గుడ్డూ పనిచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్నాళ్లు గోరఖ్పూర్లోని పర్వేజ్ టాడా అనే మాఫియా నాయకుడితో కలిసి పనిచేశాడు. అతడికి నాటు బాంబులను సరఫరా చేసేవాడు.
అతీక్ అహ్మద్ గ్యాంగ్ వయా బిహార్..
1998లో శ్రీప్రకాశ్ శుక్లా ఎన్కౌంటర్ తర్వాత అతను బిహార్కు వెళ్లిపోయాడు. అక్కడ ఉదయభాన్ అనే డాన్ గ్యాంగ్లో చేరాడు. నేరాలు చేయడానికి తరచూ ఉత్తరప్రదేశ్కు వచ్చేవాడు. 2001లో ఓ కేసులో యూపీ పోలీసులు అతడిని పట్నాలో అరెస్టు చేశారు. కానీ, ఆ కేసులో బెయిల్ దొరకడంతో యూపీలోని అతీక్ అహ్మద్ ముఠాలో చేరాడు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో గుడ్డూ కూడా నిందితుడే. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్పాల్ హత్య జరిగే సమయంలో అతడు బైకుపై ప్రయాణిస్తూ బాంబులు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై రూ. 5 లక్షల రివార్డును ప్రకటించారు. అతీక్ అహ్మద్ గ్యాంగ్ మొత్తాన్ని ఓ రకంగా ఇతడే నడిపిస్తున్నాడు. ఈ గ్యాంగ్లో తిరుగులేని నాయకుడిగా ఎదగాలన్న ఆశ కూడా అతడికి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాసిక్లో ఉన్నాడా..?
ఉమేశ్ హత్య కేసులో కీలక నిందితుడైన గుడ్డూ కోసం పోలీసులు వేట తీవ్రతరం చేశారు. మీరట్, అజ్మీర్, ఝాన్సీ, నాసిక్లలో అతడి లొకేషన్ను ప్రత్యేక బృందాలు గుర్తించాయి. కానీ, అతడు వేగంగా తన స్థావరాలను మార్చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. నాసిక్లో అతడిని అరెస్టు చేసినట్లు వార్తలు కూడా గుప్పుమన్నాయి. కానీ, తాము అరెస్టు చేసిన వ్యక్తి గుడ్డూ కాదని నాసిక్ పోలీసులు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల