Vikarabad: దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి

వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

Published : 26 Feb 2024 10:30 IST

బొంరాస్‌పేట: వికారాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దుస్తులు ఆరేస్తుండగా దంపతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బురాన్‌పూర్‌కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్‌ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు వద్ద దుస్తులు ఆరేసేందుకు వైరు తీగలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం బట్టలు ఆరేసే క్రమంలో.. వారు కట్టిన తీగకు విద్యుత్‌ ప్రసరించింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలనీకి విద్యుత్‌ సరఫరా చేసే నియంత్రికలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని