Hyderabad: యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి

హైదరాబాద్‌ నగరంలోని యూసఫ్‌గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది. 

Updated : 24 Apr 2024 07:50 IST

హైదరాబాద్‌: నగరంలోని యూసఫ్‌గూడలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో ఓ యువతి రోడ్డుపై పడింది. దీంతో అటుగావస్తున్న బస్సు యువతిపైకి ఎక్కడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని