Uttar Pradesh: నీళ్ల కోసం వస్తే.. మహిళను రాడ్లతో కొట్టి చంపారు!
గ్రామంలోని చేతి పంపు ఉపయోగించినందుకు మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేయడంతో.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో చోటుచేసుకుంది.
లఖ్నవూ: నీళ్ల కోసం చేతి పంపు (Hand Pump) ఉపయోగించినందుకు మహిళపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లోని లాల్పూర్ దేహమాఫీ గ్రామంలో చోటుచేసుకుంది. గాయాలతో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మర్హర పోలీసులు, బాధితురాలి భర్త రింకూ తెలిపిన వివరాల ప్రకారం.. సాధన(40) అనే మహిళ నీళ్ల కోసం గ్రామంలోని చేతి పంపు వద్దకు వచ్చింది. మహిళ చేతి పంపు వినియోగించడం చూసిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఈక్రమంలో ఆమెపై ఇనుప రాడ్లతో దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ భర్తపై కూడా నిందితులు దాడి చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనలో మహిళ రెండు కాళ్లు విరిగినట్లు ఆమె భర్త తెలిపారు. దాడి అనంతరం చేతి పంపు ఉపయోగించవద్దని వారు హెచ్చరించినట్లు బాధితురాలి భర్త వెల్లడించారు. తీవ్రగాయాలపాలైన మహిళను స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా ఆగ్రాలోని మరో ఆస్పత్రి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన సుధీర్ కుమార్, సందీప్, ప్రేమ్పాల్ అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో నిందితులు తమ ఇంటికి నిప్పు పెట్టినట్లు ఆమె భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఏఎస్పీ ధనంజయ్ కుస్వాహీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి