Crime News: అరుపులు వినపడకుండా మ్యూజిక్ పెట్టి.. మహిళ దారుణ హత్య
ఇంట్లో నగలు కనిపించడం లేదనే నెపంతో ఓ 23ఏళ్ల మహిళపై సమీప బంధువులు అతి దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
గాజియాబాద్: ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నగలు కనిపించడం లేదనే నెపంతో ఓ 23ఏళ్ల మహిళపై సమీప బంధువులు అతి దారుణంగా దాడి చేశారు. నేరాన్ని అంగీకరించాలని ఒత్తిడి తెస్తూ ఆమెపై బ్లేడు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఆ చిత్రహింసలు భరించలేక ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే, బాధితురాలి అరుపులు బయటకు వినిపించకుండా భారీ మ్యూజిక్ శబ్దాలను పెట్టడం గమనార్హం. ఈ అమానుష ఘటన గాజియాబాద్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్కు చెందిన సమీనా(23) నగరంలోని సిద్ధార్థ్ విహార్లో ఉండే తన బంధువులైన హీనా, రమేష్ల ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు వెళ్లింది. అయితే, ఆ వేడుకలో 5 లక్షల విలువచేసే బంగారు నగలు కనిపించకుండా పోయాయి. దాంతో బంధువులంతా సమీనానే చోరీకి పాల్పడినట్లు అనుమానించారు. దీంతో నేరాన్ని అంగీకరించాలని ఆమెపై ఒత్తిడితెచ్చారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై బ్లేడ్, రాడ్డులతో దాడి చేశారు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకు పెద్దగా మ్యూజిక్ను పెట్టారు. అలా వాళ్లు పెట్టిన చిత్రహింసలకు ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ, మ్యూజిక్ను మాత్రం కట్టివేయలేదు.
ఇలా రెండురోజుల నుంచి ఆ ఇంట్లో నుంచి భారీ మ్యూజిక్ వినిపించడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా అసలు నిజం బయటపడింది. విగతజీవిగా పడి ఉన్న సమీనాను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుల కోసం గాలింపు చేపట్టామని స్థానిక ఏసీపీ రవికుమార్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.