Crime News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే పెను విషాదం

బంధువులతో ఆ ఇల్లంతా సందడి నెలకొంది. కానీ, అంతలోనే ఒక్కసారిగా ఆ ఇంట్లో పెనువిషాదం చోటుచేసుకుంది.

Published : 11 May 2023 21:13 IST

మహబూబాబాద్‌ (నెహ్రూ సెంటర్‌): బంధువులతో ఆ ఇల్లంతా సందడి నెలకొంది. కానీ, అంతలోనే ఒక్కసారిగా ఆ ఇంట్లో పెనువిషాదం చోటుచేసుకుంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న వరుడు విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోయిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెంలో జరిగింది. కొమ్ముగూడేనికి చెందిన భూక్యా బాలాజీ, కాంతి దంపతుల కుమారుడు యాకూబ్‌కి శనివారం తెల్లవారుజామున 2.25గంటలకు వధువు గ్రామం గార్లలో వివాహం జరగనుంది.

బంధువులంతా వివాహ వేడుకల్లో నిమగ్నమై ఉండగా.. బోరు నీళ్లు పట్టేందుకు మోటార్‌ పెట్టే క్రమంలో పెళ్లికుమారుడు యాకూబ్‌ (22) విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతన్ని మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు మృతి చెందడంతో కొమ్ముగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని