Andhra News: పాముతో సెల్ఫీ.. ప్రాణం తీసిన యువకుడి మోజు

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ సరదాతో ప్రాణాలు పోగొట్టుకునాడు. తాళ్లూరుకు చెందిన మణకంఠ రెడ్డి అనే యువకుడు కందుకూరులో జ్యూస్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు.

Updated : 25 Jan 2023 19:40 IST

కందుకూరు పట్టణం: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ సరదాతో ప్రాణాలు పోగొట్టుకునాడు. తాళ్లూరుకు చెందిన మణకంఠ రెడ్డి అనే యువకుడు కందుకూరులో జ్యూస్‌ దుకాణం నిర్వహిస్తుంటాడు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలోకి మంగళవారం రాత్రి పాములు ఆడించే వ్యక్తి వచ్చాడు. అక్కడికి చేరుకున్న మణికంఠ.. పాములు ఆడించే వ్యక్తి చేతిలోని పామును తన మెడలో వేసుకొని సెల్ఫీ దిగాడు. పామును కిందికి దించుతున్న సమయంలో అది కాటు వేసింది. దీంతో స్థానికులు యువకుడిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే మణికంఠ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని