ధోని రాకకు.. నిలువెల్లా కనులై..!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ అభిమానించే క్రికెటర్లలో ఒకరు. ధోని కోసమే స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో.. ఐదేళ్ల తర్వాత విశాఖకు ఐపీఎల్ మ్యాచ్లు కేటాయించడం..
నగర అభిమానుల ఎదురుచూపులు
31న దిల్లీ క్యాపిటల్స్తో సీఎస్కే ఢీ
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ అభిమానించే క్రికెటర్లలో ఒకరు. ధోని కోసమే స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో.. ఐదేళ్ల తర్వాత విశాఖకు ఐపీఎల్ మ్యాచ్లు కేటాయించడం.. అందులో సీఎస్కే మ్యాచ్ ఉండడంతో నగర వాసుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ధోని ఆటను కళ్లారా చూడాలని అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి కల నెరవేరనుంది.
ఐపీఎల్ మ్యాచ్ల కోసం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మైదానం అంతా పచ్చని తివాచీలా తయారైంది. గ్యాలరీల్లో అభిమానులు కూర్చునేందుకు అనువుగా సీట్లు సిద్ధమయ్యాయి. డ్రెస్సింగ్ గదులు అద్భుతంగా ఉన్నాయి. మరో వైపు ఉల్లాసినులు (ఛీర్ గర్ల్స్) నృత్యాలకు ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేశారు. ఈనెల 31న దిల్లీ క్యాపిటల్స్- చెన్నై సూపర్కింగ్స్, ఏప్రిల్ 3న దిల్లీ క్యాపిటల్స్- కోల్కతా నైట్రైడర్స్ జట్లు ఇక్కడ తలపడనున్నాయి. ఇక్కడ సీఎస్కే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది.
ఆ మ్యాచ్ను మరిచిపోలేరు..
ఆదివారం జరగనున్న దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్లో ధోని ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. విశాఖ పిచ్ ధోనీకి అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ గతంలో పాక్పై చేసిన వీర విజృంభణను అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుంటే సీఎస్కే మ్యాచ్కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీనికి కారణం ధోనియే. ముందుగా 31న జరిగే సీఎస్కే మ్యాచ్ టికెట్లు విక్రయిస్తే ఏప్రిల్ 3న జరిగే మ్యాచ్కు ఆదరణ ఉండదని భావించిన నిర్వాహకులు ముందుగా 3వ తేదీ టికెట్లు విక్రయించడం గమనార్హం. అభిమానుల్లో అత్యధిక మంది ధోనీ 7వ నెంబరు జెర్సీని కొనుక్కొని స్టేడియంలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
మూడు జట్లు ఇక్కడ ఆడినవే: దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు గతంలో విశాఖ పిచ్పై ఆడినవే. ఆయా జట్లలోని క్రీడాకారులు కొందరు ఇతర ప్రాంఛైజీలకు వెళ్లగా, కొందరు ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగరానికి చెందిన రిక్కీ భుయ్ దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతుండగా, టెస్టు క్రికెటరు కె.ఎస్.భరత్ కోల్కతా నైట్రైడర్స్లో ఉన్నాడు. గుంటూరుకు చెందిన ఆంధ్రా క్రీడాకారుడు రషీద్ చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?