లైంగిక వేధింపులతోనే బాలిక ఆత్మహత్య
ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పాలిటెక్నిక్ విద్యార్థిని (17) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. లైంగిక వేధింపుల కారణంగానే బాధితురాలు బలవన్మరణానికి పాల్పడ్డారని నిర్ధరించారు.
ల్యాబ్ టెక్నీషియన్పై పోక్సో కేసు, అరెస్టు
ప్రిన్సిపాల్ సహా మరో ముగ్గుôరి అరెస్టు
విశాఖ ఘటన వివరాలు వెల్లడించిన పోలీసులు
విశాఖపట్నం, న్యూస్టుడే: ఇటీవల విశాఖలో చోటుచేసుకున్న పాలిటెక్నిక్ విద్యార్థిని (17) ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. లైంగిక వేధింపుల కారణంగానే బాధితురాలు బలవన్మరణానికి పాల్పడ్డారని నిర్ధరించారు. ప్రధాన నిందితుడితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో నలుగురిని అరెస్టు చేశామని డీసీపీ-1 మణికంఠ వెల్లడించారు. ఏసీపీ సునీల్తో కలిసి ఆయన మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ‘అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెంకు చెందిన బాలిక (17) విశాఖపట్నంలోని కొమ్మాది వద్ద చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతోంది. కళాశాలలో కొంతమంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులకు వాట్సప్ సందేశం పంపించింది. అనంతరం వసతిగృహం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విచారణలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఎన్.శంకరరావు అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిసింది. ల్యాబ్లో తమను కావాలనే తాకడం, అసభ్యకరంగా ప్రవర్తించడం చేసేవాడని పలువురు విద్యార్థినులు వెల్లడించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. ఈ వ్యవహారంలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఘటన జరిగిన రోజున ఉదయం నుంచి విద్యార్థిని కనిపించకపోయినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆ రోజు తరగతులకు హాజరు కాకుండా ఆ విద్యార్థిని హాస్టల్లోనే ఉండిపోయినా ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వార్డెన్ భర్తకు అదే వసతిగృహంలో గదిని సైతం కేటాయించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని యాజమాన్యానికి సంబంధించి శంకర్ వర్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జి.భానుప్రవీణ్, వార్డెన్ వి.ఉషారాణి, వార్డెన్ భర్త వి.ప్రదీప్కుమార్లను అరెస్టు చేశాం’ అని డీసీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్