నమ్మించి.. వంచన
ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బకాయిల కోసం ఉద్యోగుల ఎదురు చూపులు
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్టుడే
బందరు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చౌక్లో ఆందోళన
ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి రావాల్సిన బకాయిలను సైతం ఏళ్లతరబడి విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బకాయిలు చెల్లించకపోగా ఆ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకోవడం పట్ల ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఆరునెలల నుంచి ఏడాది కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది. పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, ఇంటి నిర్మాణాలకోసం జీపీఎఫ్ రుణం కోసం దరఖాస్తు చేసుకుని సకాలంలో అందక, బయట అప్పులు చేసి వడ్డీలు చెల్లించలేక అనేక అవస్థలు పడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛను దారులకు రావాల్సిన వివిధ బకాయిలు రూ.25వేలకోట్లు ఉండగా జిల్లాలో దాదాపు 15వేలమందికి పైగా రూ.వెయ్యి కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు ఉద్యోగ వర్గాల అంచనా. బకాయిలపై తరుచూ ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోగా కక్ష కట్టినట్లు వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యనిధి ఖాతాకు వడ్డీ జమచేయకపోవడంతో నిల్వలు తగ్గిపోతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
అప్పులు చేయాల్సివచ్చింది..
- బి.మాణిక్యాలరావు, ఏటీపీఎఫ్ నాయకుడు
గతంలో ఎన్నడూ లేని విధంగా బకాయిలు రూ.వేల కోట్లల్లో పేరుకుపోయాయి. ఓ ఉద్యోగి తన కుటుంబ అవసరాల నిమిత్తం పీఎఫ్ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆరునెలలకు గాని రుణానికి సంబంధించి నిధులు జమ కాలేదు. అవసరానికి రుణం నిధులు జమకాకపోవడంతో చేసేది లేక బయట వ్యాపారుల వద్ద అప్పుతెచ్చుకోవాల్సి వచ్చింది. సరెండర్లీవుల బకాయిల కోసం ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాం.
ఎప్పుడూ ఇలా లేదు
- వీరంకి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘ నాయకుడు
జిల్లా పరిషత్ పీఎఫ్ బకాయిలు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయి.ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆరునెలలైనా ఇంతవరకు పీఎఫ్ చివరి చెల్లింపులు ఇవ్వడం లేదు. ఉన్నత పాఠశాలలో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పీజీటీలకు ఇంక్రిమెంట్ చేసుకోవడానికి ఏడాది తరువాత అవకాశం కల్పించారు. అవి ఇప్పటికీ ఖాతాలకు జమకాలేదు. ఇలా ఉద్యోగ, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నెలల తరబడి ఎదురుచూపులే..
- కొప్పినీడి సూర్యప్రకాష్, యూటీఎఫ్ జిల్లా నాయకుడు
ఉద్యోగ విరమణ చేసిన ఓ ఉద్యోగి తనకు రావాల్సిన భవిష్యనిధికి సంబంధించిన డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి గతంలో లేదు. బ్యాంకు ఖాతా చూసుకోవడం నిరాశ చెందడం పరిపాటిగా మారింది. బకాయిలు విడుదల చేయాలంటూ రోడ్లెక్కి నిరసనల రూపంలో ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే అవసరాలకు వినియోగించుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ
[ 26-07-2024]
కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా శుక్రవారం పోరంకి గ్రీన్ స్కూల్ విద్యార్థులు పలు సేవా క్యార్యక్రమాలు నిర్వహించారు. -
దిల్లీ ధర్నాతో అభాసు పాలైన జగన్ : దేవినేని ఉమా
[ 26-07-2024]
ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ దిల్లీ పారిపోయి అక్కడ ధర్నా చేసి అబాసు పాలయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. -
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
[ 26-07-2024]
గత నెలన్నరగా ఎన్టీఆర్ కమిషనరేట్లో నమోదైన సైబర్ మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే. పదుల సంఖ్యలో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. -
‘నా’దంటూ.. గుంజడమే ప‘ని’..!
[ 26-07-2024]
గుడివాడలో దశాబ్దాలుగా కళలకు వెలుగులద్దుతూ.. కళాకారులు, రచయితలు, కవులకు కేంద్రంగా ఉన్న ‘బారిష్టరు శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామిచౌదరి స్మారక కళాభవనం’ కబ్జా కోరల్లో చిక్కుకుంది. -
వైకాపా పా‘పాలు’.. వెంటాడే శాపాలు
[ 26-07-2024]
గతంలో జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన పాల వెల్లువ కార్యక్రమంపై గ్రామాల్లో తిరుగుబాటు మొదలైంది. -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు..!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు... నాటి జగన్ సర్కారు చేసిందిదే... -
పైవంతెన ప్రాజెక్టు డీపీఆర్కు వినతి
[ 26-07-2024]
జాతీయ రహదారి 16పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు నిర్మించే నాలుగు లైన్ల పైవంతెనకు సంబంధించి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కలిసి వినతిపత్రం అందజేశారు. -
నాణ్యత కల్ల.. దారులు గుల్ల
[ 26-07-2024]
నిత్యం ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వేలాది వాహనాలు రాకపోకలు సాగించే చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పరిస్థితి ఎప్పటికప్పుడు దారుణంగా మారింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళితులంతా ఏకం కావాలి. చైతన్యవంతం కావాలి. -
మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య కొత్త రైల్వేలైన్
[ 26-07-2024]
మచిలీపట్నం నుంచి నర్సాపూర్కు కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. -
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని తీర్పు
[ 26-07-2024]
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
[ 26-07-2024]
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తాడేపల్లి 12వ వార్డు సచివాలయ వీఆర్వో దుర్మరణం పాలయ్యారు. -
బోటు తిరగబడి మత్స్యకారుడి మృతి
[ 26-07-2024]
చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండల పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు