అసంపూర్తి పనులు.. ప్రజలకు అవస్థలు
నగరంలో ప్రధాన డ్రెయిన్లపై నిర్మించిన కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. రిటైనింగ్ వాల్స్ లేకపోవడం, ఉన్నవి దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈడేపల్లి శక్తి గుడి వద్ద పూర్తికాని రిటైనింగ్ వాల్
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే: నగరంలో ప్రధాన డ్రెయిన్లపై నిర్మించిన కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. రిటైనింగ్ వాల్స్ లేకపోవడం, ఉన్నవి దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సమస్యను అనేక సార్లు పాలకులు, అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదాలు జరిగినప్పుడు ఇదిగో సమస్య పరిష్కరిస్తామని చెప్పడమే కానీ తరువాత పట్టించుకోకపోవడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ పరిస్థితి
- శక్తి ఆలయం ప్రాంతంలో ప్రధాన డ్రెయిన్కు రిటైనింగ్ వాల్ అసంపూర్తిగా వదిలేశారు. ఆ పక్కనే నిర్మించిన గోడ కూడా పగిలిపోయింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
- స్టాండ్ వెనుక నుంచి ఈడేపల్లి వెళ్లే దారిలోని డ్రెయిన్పై కల్వర్టు నిర్మించారు. రిటైనింగ్ వాల్స్ నిర్మించకుండా వదిలేశారు. రాత్రి వేళ ఒక్కోసారి వాహనదారులు డ్రెయిన్లోకి వెళ్లిపోతున్నారని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
- బైపాస్ రోడ్డు నుంచి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే రహదారి పక్కన ప్రధాన డ్రెయిన్ వద్ద కల్వర్టులు కుంగిపోవడంతో పాటు రహదారి కూడా కోతకు గురైంది. పరాసుపేట, చిలకలపూడి, సర్కిల్పేట, ఉల్లింగిపాలెం తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
- అధికారులు, పాలకులు పట్టించుకుంటే తక్కువ నిధులతోనే సమస్య పరిష్కరించవచ్చు. కానీ ఆ దిశగా ఎవరూ చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ప్రమాదపుటంచున ప్రయాణం చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బైపాస్ రోడ్డు నుంచి పెట్రోల్ బంకు పక్క నుంచి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే దారిలో ప్రమాదకరంగా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ
[ 26-07-2024]
కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా శుక్రవారం పోరంకి గ్రీన్ స్కూల్ విద్యార్థులు పలు సేవా క్యార్యక్రమాలు నిర్వహించారు. -
దిల్లీ ధర్నాతో అభాసు పాలైన జగన్ : దేవినేని ఉమా
[ 26-07-2024]
ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ దిల్లీ పారిపోయి అక్కడ ధర్నా చేసి అబాసు పాలయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. -
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
[ 26-07-2024]
గత నెలన్నరగా ఎన్టీఆర్ కమిషనరేట్లో నమోదైన సైబర్ మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే. పదుల సంఖ్యలో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. -
‘నా’దంటూ.. గుంజడమే ప‘ని’..!
[ 26-07-2024]
గుడివాడలో దశాబ్దాలుగా కళలకు వెలుగులద్దుతూ.. కళాకారులు, రచయితలు, కవులకు కేంద్రంగా ఉన్న ‘బారిష్టరు శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామిచౌదరి స్మారక కళాభవనం’ కబ్జా కోరల్లో చిక్కుకుంది. -
వైకాపా పా‘పాలు’.. వెంటాడే శాపాలు
[ 26-07-2024]
గతంలో జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన పాల వెల్లువ కార్యక్రమంపై గ్రామాల్లో తిరుగుబాటు మొదలైంది. -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు..!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు... నాటి జగన్ సర్కారు చేసిందిదే... -
పైవంతెన ప్రాజెక్టు డీపీఆర్కు వినతి
[ 26-07-2024]
జాతీయ రహదారి 16పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు నిర్మించే నాలుగు లైన్ల పైవంతెనకు సంబంధించి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కలిసి వినతిపత్రం అందజేశారు. -
నాణ్యత కల్ల.. దారులు గుల్ల
[ 26-07-2024]
నిత్యం ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వేలాది వాహనాలు రాకపోకలు సాగించే చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పరిస్థితి ఎప్పటికప్పుడు దారుణంగా మారింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళితులంతా ఏకం కావాలి. చైతన్యవంతం కావాలి. -
మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య కొత్త రైల్వేలైన్
[ 26-07-2024]
మచిలీపట్నం నుంచి నర్సాపూర్కు కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. -
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని తీర్పు
[ 26-07-2024]
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
[ 26-07-2024]
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తాడేపల్లి 12వ వార్డు సచివాలయ వీఆర్వో దుర్మరణం పాలయ్యారు. -
బోటు తిరగబడి మత్స్యకారుడి మృతి
[ 26-07-2024]
చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండల పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM