కేంద్రం తీరుతో పెరిగిన నిరుద్యోగం: డీవైఎఫ్ఐ
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని కేరళకి చెందిన రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎ.ఎ.రహీం ఆరోపించారు.
ప్రసంగిస్తున్న రాజ్యసభ సభ్యుడు రహీం. చిత్రంలో సంఘం నాయకులు
విజయవాడ (అలంకార్కూడలి), న్యూస్టుడే : కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని కేరళకి చెందిన రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎ.ఎ.రహీం ఆరోపించారు. శనివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ‘పెరుగుతున్న నిరుద్యోగం-పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా, 14శాతం నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. కరోనా సమయంలో దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయి, యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పీజీలు చదివిన వారు చిన్న చిన్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక సుమారు 25వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. నిరుద్యోగం పెరుగుతున్నా.. ప్రధాని మోదీకి, ఇక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి పట్టవన్నట్లు వారి వ్యవహార శైలి ఉందన్నారు. నిరుద్యోగం తగ్గించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ శాకల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన అనేక హామీలను విస్మరించిందని, రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి.రామన్న, నాయకులు ఎన్.నాగేశ్వరరావు, కృష్ణ, జయచంద్ర, శివకుమార్ బాబు, రాజు, సూర్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ
[ 26-07-2024]
కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా శుక్రవారం పోరంకి గ్రీన్ స్కూల్ విద్యార్థులు పలు సేవా క్యార్యక్రమాలు నిర్వహించారు. -
దిల్లీ ధర్నాతో అభాసు పాలైన జగన్ : దేవినేని ఉమా
[ 26-07-2024]
ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ దిల్లీ పారిపోయి అక్కడ ధర్నా చేసి అబాసు పాలయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. -
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
[ 26-07-2024]
గత నెలన్నరగా ఎన్టీఆర్ కమిషనరేట్లో నమోదైన సైబర్ మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే. పదుల సంఖ్యలో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. -
‘నా’దంటూ.. గుంజడమే ప‘ని’..!
[ 26-07-2024]
గుడివాడలో దశాబ్దాలుగా కళలకు వెలుగులద్దుతూ.. కళాకారులు, రచయితలు, కవులకు కేంద్రంగా ఉన్న ‘బారిష్టరు శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామిచౌదరి స్మారక కళాభవనం’ కబ్జా కోరల్లో చిక్కుకుంది. -
వైకాపా పా‘పాలు’.. వెంటాడే శాపాలు
[ 26-07-2024]
గతంలో జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన పాల వెల్లువ కార్యక్రమంపై గ్రామాల్లో తిరుగుబాటు మొదలైంది. -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు..!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు... నాటి జగన్ సర్కారు చేసిందిదే... -
పైవంతెన ప్రాజెక్టు డీపీఆర్కు వినతి
[ 26-07-2024]
జాతీయ రహదారి 16పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు నిర్మించే నాలుగు లైన్ల పైవంతెనకు సంబంధించి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కలిసి వినతిపత్రం అందజేశారు. -
నాణ్యత కల్ల.. దారులు గుల్ల
[ 26-07-2024]
నిత్యం ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వేలాది వాహనాలు రాకపోకలు సాగించే చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పరిస్థితి ఎప్పటికప్పుడు దారుణంగా మారింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళితులంతా ఏకం కావాలి. చైతన్యవంతం కావాలి. -
మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య కొత్త రైల్వేలైన్
[ 26-07-2024]
మచిలీపట్నం నుంచి నర్సాపూర్కు కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. -
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని తీర్పు
[ 26-07-2024]
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
[ 26-07-2024]
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తాడేపల్లి 12వ వార్డు సచివాలయ వీఆర్వో దుర్మరణం పాలయ్యారు. -
బోటు తిరగబడి మత్స్యకారుడి మృతి
[ 26-07-2024]
చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండల పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి