logo

బూరగడ్డ వేదవ్యాస్‌కు అస్వస్థత

తెదేపా రాష్ట్ర నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో శనివారం పర్యటించిన ఆయన చినపాండ్రాకలో విలేకర్లతో మాట్లాడుతుండగా పార్టీ టిక్కెట్‌ కాగిత కృష్ణప్రసాద్‌కు ఇచ్చినట్లు సమాచారం అందింది.

Updated : 25 Feb 2024 06:56 IST

 వేదవ్యాస్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న అభిమానులు

పెడన, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో శనివారం పర్యటించిన ఆయన చినపాండ్రాకలో విలేకర్లతో మాట్లాడుతుండగా పార్టీ టిక్కెట్‌ కాగిత కృష్ణప్రసాద్‌కు ఇచ్చినట్లు సమాచారం అందింది. దీంతో భావోదేగ్వానికి గురైన ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు(బీపీ) పెరిగి కుర్చీలోనే ఒరిగిపోయారు. అభిమానులు హుటాహుటిన చినపాండ్రాకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఆయన్ను మచిలీపట్నంలోని నివాసానికి తరలించగా వైద్యులు ఇంటివద్దే మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

టిక్కెట్‌ ఆశించా :  తనకు పెడన టిక్కెట్‌ నిస్తారని ఆశించానని వేదవ్యాస్‌ అంతకముందు విలేకర్లకు తెలిపారు. చివరి నిమిషంలో తన పేరు ప్రకటించకపోవడం ఆశ్ఛర్యం కల్గించిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా వస్తుందని ఆశించానని, వచ్చే ఎన్నికల్లో తప్పక ప్రాధాన్యం ఇస్తామని అధినేత చంద్రబాబు తనకు నచ్చచెప్పారని గుర్తుచేశారు. భవిష్యత్తు కార్యాచరణను కార్యకర్తలతో మాట్లాడి ప్రకటిస్తానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని