తెదేపాతో క్రీడా వికాసం.. వైకాపాతో వినాశనం
గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యం వెలికితీసి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలన్న ఉన్నత లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాస పథకం ప్రవేశపెట్టింది.
ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి మంగళం
ఉమ్మడి జిల్లాలో ఆటలు అటకెక్కించిన జగన్
అనంతపురం క్రీడలు, న్యూస్టుడే: గ్రామీణ క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యం వెలికితీసి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలన్న ఉన్నత లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాస పథకం ప్రవేశపెట్టింది. కొత్త క్రీడా విధానాన్ని రూపొందించి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం, ఆటస్థలాలు అభివృద్ధి చేయాలన్నదే ఆ పథకం ముఖ్య లక్ష్యం. ఈ మేరకు ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించింది. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆటలను అటకెక్కించింది. క్రీడాభివృద్ధిని గాలికొదిలేసింది. నిర్మాణాలను ఎక్కడికక్కడే వదిలేసింది. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క స్టేడియం కూడా నిర్మించిన పాపానపోలేదు. క్రీడా వికాస పథకం ఉద్దేశం ఘనంగా ఉన్నా.. తెదేపా ప్రభుత్వంపై కసితో ఆ పథకాన్ని మూలనపడేసి పైశాచిక ఆనందం పొందింది.
బిల్లులు చెల్లించకపోవడంతోనే..
స్టేడియాల నిర్మాణం ఆలస్యం కావడానికి అసలు కారణం బిల్లులదే. పనులు జరిగిన దశ వరకు కూడా బిల్లులు చెల్లించలేదు. పనులు 25 శాతం దాటకపోతే ఆపేయాలని అప్పట్లో ప్రభుత్వమే ఆదేశించింది. ఓ గుత్తేదారు న్యాయస్థానానికి వెళ్లడంతో కొంత మేరకు బిల్లులు చెల్లించారు. అనంతపురం, శింగనమల, ఆత్మకూరులో ప్రతిపాదనలు దశలోనే ఆగాయి.
ఎక్కడి పనులు అక్కడే...
క్రీడావికాస పథకం కింద 2018లో అనంతపురం జిల్లాలో మొత్తం ఐదు ఇండోర్ స్టేడియాల నిర్మాణం ప్రారంభించారు. గుంతకల్లు, కల్లూరు, తాడిపత్రి, రాయదుర్గం, ఉరవకొండ పట్టణాల్లో నిర్మాణం చేపట్టారు. ఒక్కో స్టేడియానికి రూ.2 కోట్ల అంచనాతో పనులు మొదలెట్టారు. వీటి నిర్మాణం జరిగితే షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, జూడో, కుస్తీ తదితర క్రీడాంశాలు సాధన చేసుకోవచ్చు. గుంతకల్లులో రూప్స్థాయి వరకు నిర్మించారు. ఉరవకొండ, కల్లూరు, తాడిపత్రి, రాయదుర్గంలో పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురం, మడకశిరలో 80 శాతం వరకు పూర్తయ్యాయి. వీటిని కూడా పూర్తి చేయకుండా ప్రభుత్వం కుంటిసాకులు వెతికింది. సీకేపల్లి, కనగానపల్లి, కొత్తచెరువు మండలాల్లో పునాదుల దశలోనే ఆగిపోయాయి. ఇందులో పిచ్చిమొక్కలు మొలవడంతో నిర్మాణ ఆనవాళ్లూ కనిపించలేదు. కదిరిలో అసలు నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు.
శిలాఫలకమే సాక్షి..
ముదిగుబ్బ: తెదేపా హయాంలో ముదిగుబ్బలో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి రూ.1.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. అత్యాధునిక హంగులతో సుమారు 2.23 ఎకరాల్లో స్టేడియం నిర్మించేందుకు స్థలం ఏర్పాటు చేసింది. వైకాపా అధికారం చేపట్టాక అభివృద్ధి మాట దేవుడెరుగు.. ఆ స్థలం ఆక్రమణకు బరితెగించారు. రహదారిని కబ్జా చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు.
పడకేసిన నిర్మాణం
రాయదుర్గం: ఆదర్శ పాఠశాల ఆవరణలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇండోర్ స్టేడియం పనులు ఐదేళ్లుగా పడకేశాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో 2018లో దాదాపు రూ.10 లక్షల పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. కంపచెట్లు, పిచ్చి మొక్కలు వృక్షాలుగా మారాయి.
ఒక్క ఇటుకనూ పేర్చలేదు
ఉరవకొండ: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడటంతో స్టేడియం నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ ఐదేళ్లల్లో ఒక్క ఇటుకను కూడా ఈ ప్రభుత్వం నిర్మాణం కోసం పేర్చలేదు. నిర్మాణం పూర్తయి ఉంటే కళాశాలలో 700 మంది విద్యార్థులకు ఉపయోగంగా ఉండేది.
న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో..
కొత్తచెరువు: నియోజకవర్గ స్థాయి ఇండోర్ స్టేడియాన్ని కొత్తచెరువుకు మంజూరు చేశారు. పనులు కూడా ప్రారంభించడంతో త్వరలో అందుబాటులోకి వస్తుందని క్రీడాకారులు కలలు కన్నారు. గుత్తేదారులు బాబు, అంకాళ్రెడ్డిలు రూ.50 లక్షలు వెచ్చించి పనులు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక బిల్లుల మంజూరులో జాప్యం జరగడంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇటీవల రూ.15 లక్షలు బిల్లు మాత్రం మంజూరైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో వెలగని అనంత క్రీడాజ్యోతి
[ 26-07-2024]
ఆటల్లో అరంగ్రేటం ప్రతి ఆటగాడి కల. ఒలింపిక్స్లో ఆడాలన్నదే...విశ్వక్రీడల్లో ఒక్క పతకం సాధిస్తే చాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు మారుమోగుతుంది. ఒలింపిక్స్లో స్వర్ణం, రజతం, కాంస్యం ఏ పతకమైనా సాధిస్తే కోట్ల మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. -
గుట్టు వీడుతోంది.. స్త్రీ నిధి సొమ్ము కాజేసిన ఉద్యోగులు
[ 26-07-2024]
మహిళలు స్వయం ఉపాధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు అప్పుగా తీసుకున్న సొమ్ము అక్రమార్కులకు వరంగా మారింది. మహిళలు పైసా పైసా కూడబెట్టిన సొమ్మును డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులు వాటాలు వేసుకుని స్వాహా చేస్తున్నారు. -
9 నెలల్లో 17 మాతృ మరణాలా?
[ 26-07-2024]
‘క్షేత్రస్థాయిలో వైద్య, ఆరోగ్య సిబ్బందిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. తొమ్మిది మాసాల్లో 17 మంది తల్లులు చనిపోయారంటే ఆషామాషీగా తీసుకోవద్దు. మాతృ మరణాలు ఎలా సంభిస్తున్నాయి’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ ప్రశ్నించారు. -
కొత్త ఎస్పీలు.. వేళ్లూనుకున్న సవాళ్లు
[ 26-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దౌర్జన్యాలు రాజ్యమేలాయి. అధికార పార్టీ నాయకుల అండతో కార్యకర్తలు రెచ్చిపోయి తెదేపా సానుభూతిపరులపై అనవసరంగా కేసులు నమోదు చేయించారు. -
ఎమ్మెల్యే ఔదార్యం.. డీఎస్సీ శిక్షణార్థులకు వరం
[ 26-07-2024]
కరవుసీమలో వేలకు వేలు ఖర్చు చేసి డీఎస్సీకి సాధన అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.. వారి కష్టాలను అర్థం చేసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ఉచితశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సొంత ఖర్చులతో రాష్ట్రంలోని ఉత్తమ శిక్షకులను రప్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. -
20 శాతం పనులే పూర్తి
[ 26-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆసుపత్రి విస్తరణలో భాగంగా పలు విభాగాలకు ప్రత్యేక భవనాలు నిర్మించి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పనుల కింద 2020లో రూ.300 కోట్లు కేటాయించింది. -
ఉగ్రరూప.. తుంగభద్ర
[ 26-07-2024]
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 80 వేల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయంలోని 33 గేట్లకుగాను 28 గేట్లను పైకెత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. -
వీడని గుర్తుతెలియని మృతదేహాల మిస్టరీ
[ 26-07-2024]
గుర్తు తెలియని శవాల ఆచూకీ మిస్టరీగా ఉంటోంది. పట్టణం, గ్రామ ప్రాంతాల్లోనే కాకుండా రైల్వే లైన్లో పలు శవాలు లభ్యం అవుతుండడంతో పోలీసులు కేసులను నమోదు చేసి విచారణ చేస్తుంటే కొన్ని శవాల ఆచూకీ లభిస్తుండగా మరికొన్నింటి సమాచారం వెలుగులోకి రావడం లేదు. -
వ్యాపారం.. ఘరానా మోసం
[ 26-07-2024]
నల్లచెరువు మండల కేంద్రంలో మూడు నెలల కిందట వ్యాపారం నిమిత్తం వచ్చిన ఉమామహేశ్వరెడ్డి పలువురిని మోసం చేసి ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. -
రిలయన్స్ మార్ట్ ధ్వంసం కేసు..
[ 26-07-2024]
రిలయన్స్ మార్ట్ను ధ్వంసం చేసిన కేసును అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రిలయన్స్ మార్ట్ను రాజశేఖర్రెడ్డి అభిమానులు, ప్రస్తుత వైకాపా నాయకులు 2009లో దాడి చేసి నిప్పు పెట్టారనేది ఆరోపణ. -
భారీగా గోవా మద్యం పట్టివేత
[ 26-07-2024]
రాయదుర్గం మీదుగా అనంతపురానికి అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పెద్దఎత్తున పట్టుబడింది. సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సీఐలు వెంకటలక్ష్మమ్మ, మురళీమోహన్ తమ సిబ్బందితో కలిసి గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి