మున్సిపల్ కార్మికులకు ముఖ హాజరు రద్దు చేయాలి
మున్సిపల్ కార్మికులకు ముఖ హాజరు రద్దు చేసి పాత పద్ధతిలోనే హాజరు వేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండు చేశారు.
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజేష్ తదితరులు
ఆజాద్నగర్, న్యూస్టుడే: మున్సిపల్ కార్మికులకు ముఖ హాజరు రద్దు చేసి పాత పద్ధతిలోనే హాజరు వేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండు చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం అనంతపురంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసే కార్యక్రమం చేపట్టారు. రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీఎఫ్ఆర్ఎస్ వ్యవస్థను మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, కార్మికులు కూడా వారి మొబైళ్ల నుంచి ప్రతిరోజు నాలుగు దఫాలు లొకేషన్లలో హాజరు తీసుకోవాలని, ఇప్పటికే చాలా మున్సిపల్ కార్పొరేషన్లలో కమిషనర్లు కార్మికులకు హుకుం జారీ చేస్తున్నారన్నారు. నిరక్షరాస్యులు, సెల్ఫోన్ వాడకం తెలియని కార్మికులు తమ మస్టర్ పడుతుందో లేదోనని భయాందోళనలో ఉన్నారన్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 28న మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 30న కలెక్టరేట్ ఎదుట, ఫిబ్రవరి 8న మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి, 15న టూల్డౌన్ చేపడతామని వారు హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్గౌడ్, ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, వేణుగోపాల్, నాగరాజు, నాగేంద్రబాబు, శివకృష్ణ, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో వెలగని అనంత క్రీడాజ్యోతి
[ 26-07-2024]
ఆటల్లో అరంగ్రేటం ప్రతి ఆటగాడి కల. ఒలింపిక్స్లో ఆడాలన్నదే...విశ్వక్రీడల్లో ఒక్క పతకం సాధిస్తే చాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు మారుమోగుతుంది. ఒలింపిక్స్లో స్వర్ణం, రజతం, కాంస్యం ఏ పతకమైనా సాధిస్తే కోట్ల మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. -
గుట్టు వీడుతోంది.. స్త్రీ నిధి సొమ్ము కాజేసిన ఉద్యోగులు
[ 26-07-2024]
మహిళలు స్వయం ఉపాధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు అప్పుగా తీసుకున్న సొమ్ము అక్రమార్కులకు వరంగా మారింది. మహిళలు పైసా పైసా కూడబెట్టిన సొమ్మును డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులు వాటాలు వేసుకుని స్వాహా చేస్తున్నారు. -
9 నెలల్లో 17 మాతృ మరణాలా?
[ 26-07-2024]
‘క్షేత్రస్థాయిలో వైద్య, ఆరోగ్య సిబ్బందిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. తొమ్మిది మాసాల్లో 17 మంది తల్లులు చనిపోయారంటే ఆషామాషీగా తీసుకోవద్దు. మాతృ మరణాలు ఎలా సంభిస్తున్నాయి’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ ప్రశ్నించారు. -
కొత్త ఎస్పీలు.. వేళ్లూనుకున్న సవాళ్లు
[ 26-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దౌర్జన్యాలు రాజ్యమేలాయి. అధికార పార్టీ నాయకుల అండతో కార్యకర్తలు రెచ్చిపోయి తెదేపా సానుభూతిపరులపై అనవసరంగా కేసులు నమోదు చేయించారు. -
ఎమ్మెల్యే ఔదార్యం.. డీఎస్సీ శిక్షణార్థులకు వరం
[ 26-07-2024]
కరవుసీమలో వేలకు వేలు ఖర్చు చేసి డీఎస్సీకి సాధన అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.. వారి కష్టాలను అర్థం చేసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే నియోజకవర్గ కేంద్రంలో ఉచితశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. సొంత ఖర్చులతో రాష్ట్రంలోని ఉత్తమ శిక్షకులను రప్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. -
20 శాతం పనులే పూర్తి
[ 26-07-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆసుపత్రి విస్తరణలో భాగంగా పలు విభాగాలకు ప్రత్యేక భవనాలు నిర్మించి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పనుల కింద 2020లో రూ.300 కోట్లు కేటాయించింది. -
ఉగ్రరూప.. తుంగభద్ర
[ 26-07-2024]
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 80 వేల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయంలోని 33 గేట్లకుగాను 28 గేట్లను పైకెత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. -
వీడని గుర్తుతెలియని మృతదేహాల మిస్టరీ
[ 26-07-2024]
గుర్తు తెలియని శవాల ఆచూకీ మిస్టరీగా ఉంటోంది. పట్టణం, గ్రామ ప్రాంతాల్లోనే కాకుండా రైల్వే లైన్లో పలు శవాలు లభ్యం అవుతుండడంతో పోలీసులు కేసులను నమోదు చేసి విచారణ చేస్తుంటే కొన్ని శవాల ఆచూకీ లభిస్తుండగా మరికొన్నింటి సమాచారం వెలుగులోకి రావడం లేదు. -
వ్యాపారం.. ఘరానా మోసం
[ 26-07-2024]
నల్లచెరువు మండల కేంద్రంలో మూడు నెలల కిందట వ్యాపారం నిమిత్తం వచ్చిన ఉమామహేశ్వరెడ్డి పలువురిని మోసం చేసి ఉడాయించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. -
రిలయన్స్ మార్ట్ ధ్వంసం కేసు..
[ 26-07-2024]
రిలయన్స్ మార్ట్ను ధ్వంసం చేసిన కేసును అనంతపురం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రిలయన్స్ మార్ట్ను రాజశేఖర్రెడ్డి అభిమానులు, ప్రస్తుత వైకాపా నాయకులు 2009లో దాడి చేసి నిప్పు పెట్టారనేది ఆరోపణ. -
భారీగా గోవా మద్యం పట్టివేత
[ 26-07-2024]
రాయదుర్గం మీదుగా అనంతపురానికి అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యం పెద్దఎత్తున పట్టుబడింది. సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాల మేరకు సీఐలు వెంకటలక్ష్మమ్మ, మురళీమోహన్ తమ సిబ్బందితో కలిసి గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు