విచారణ తొక్కిపెట్టేసి..
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది..
జడ్పీ పూర్వ అధికారి నిర్వాకం
లోకాయుక్త ఆగ్రహంతో పునఃప్రారంభం
న్యూస్టుడే, చిత్తూరు జడ్పీ,(మిట్టూరు)
జడ్పీ కార్యాలయం
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. పైగా తన(పూర్వ అధికారి)పైనే విచారణ చేపడతారా? అంటూ ఏకంగా విచారణాధికారిపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో సదరు జిల్లా అధికారి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.. తనకున్న ‘పెద్ద’ పలుకుబడితో కేడర్ను సైతం మరిచిపోయి జిల్లా అధికారులపై ఆయన పెత్తనం చేసిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.. అసలు ఈ వ్యవహారం తనకు అండగా ఉన్నారని చెప్పుకొంటున్న అధికార పార్టీ కీలక మంత్రివర్యులకు తెలియకపోవచ్చని.. ఆయన పేరు చెప్పి అందరిపై ఓరకంగా జులుం చేస్తున్నారనే చర్చ జిల్లా అధికార వర్గాల్లో నడుస్తోంది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా బీఆర్జీఎఫ్ నిధులు విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ 2014వరకు కొనసాగింది. ఆపై ఈ నిధులను ప్రభుత్వం నిలిపేసింది. జిల్లా పరిషత్తుకు సంబంధించి 2014కు ముందు బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో కోట్లాది రూపాయలు వచ్చాయి. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేయడంతో దానిపై వచ్చిన వడ్డీని వినియోగించే విషయంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా సదరు నిధులు తనకు అనుకూలంగా ఉన్న బ్యాంకులో జమ చేయించడం సహా వచ్చిన వడ్డీ దుర్వినియోగం చేశారంటూ అప్పటి ప్లానింగ్-2 సూపరింటెండెంట్పై జడ్పీ పూర్వ ఉద్యోగులే లోకాయుక్తకు కొన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. వడ్డీ కింద వచ్చిన కోట్లాది రూపాయలను తన అనుకూలురకు ఇవ్వడం సహా సొంతానికి వాడుకున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై గతేడాది లోకాయుక్త విచారణకు ఆదేశించింది. జిల్లా ఆడిట్ అధికారిని విచారణాధికారిగా నియమించడంతో ఆయన రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న పూర్వ అధికారి(ప్రస్తుతం మైనార్టీ కార్పొరేషన్లో ఉన్నారు) ఏకంగా విచారణ జరగకుండా తనకున్న పలుకుబడితో అడ్డుకున్నారు. ‘నాపైనే విచారణ చేస్తారా.. వెళ్లి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడు.. ఆయన అన్నీ చెబుతారు..’ అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో విచారణాధికారి బిత్తరపోయినట్లు తెలిసింది. చిన్న కేడర్(ఎంపీడీవో)లో ఉన్న అధికారి.. విచారణాధికారినైన తనను ఇలా మాట్లాడటం, దీనికితోడు జిల్లా యంత్రాంగంలో పలువురు పూర్వ అధికారికే వత్తాసు పలకడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీంతో విచారణ నిలిచిపోయింది. ‘పెద్ద’మంత్రి పేరు చెప్పి విచారణ సైతం నిలిపివేయించుకుని పూర్వ అధికారి.. దర్జాగా బయట తిరుగుతుండటంతో కొందరు జిల్లా అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండునెలల నుంచి లోకాయుక్త దీనిపై వెంటనే నివేదించాలని జిల్లా అధికారులను మరోసారి ఆదేశించడంతో చేసేదేమీలేక విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరోవైపున పోలింగ్ ముగిసిన మరుసటిరోజు విచారణాధికారి తన బృందంతో.. జడ్పీ కార్యాలయానికి వెళ్లి తమకందిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా అవసరమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నాటి దస్త్రాలు కావడంతో రెండుమూడ్రోజులు పట్టింది. ఇప్పటికే తీసుకున్న వాటిని ఒక విడత పరిశీలించిన విచారణాధికారులు కొందరి స్టేట్మెంట్లు రికార్డు చేసేందుకు సన్నద్ధమయ్యారు. నేటినుంచి విచారణ పూర్తిస్థాయిలో మొదలు కానుండటంతో జడ్పీ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. అప్పట్లో పూర్వ అధికారికి ఈ విషయంలో సహకరించిన వారందరినీ విచారించనున్నారు. ఆయన మాట విన్నందుకు తమపై ఏం చర్యలు ఉంటాయోనని వారు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం