దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూపరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి.
మరోసారి అక్రమంగా పరీక్షల నిర్వహణకు కుట్ర
ఎస్వీయూలో విశ్రాంత అధికారుల తప్పటడుగులు
తిరుపతి(నగరపాలిక), న్యూస్టుడే
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. ఆదాయపరంగా దూరవిద్యా కేంద్రం నుంచి రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఎదిగింది. ఎస్వీయూ అత్యాశ, దూరవిద్యా కేంద్రాన్ని ఉద్దరించేందుకు వచ్చిన కొందరు విశ్రాంత అధ్యాపకులు వర్సిటీ పరువును బజారుకీడ్చేలా గత నాలుగేళ్లుగా వ్యవహరించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలను బేఖాతరు చేయడంతో దూరవిద్య కేంద్రం ప్రవేశాలపై నిషేధం విధించారు.
పరీక్షల నిర్వహణకు ఒత్తిడి
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు దూరవిద్యా కేంద్రం అధికారులు ఎస్వీయూపై ఒత్తిడి పెంచారు. ఎన్నికల ఫలితాలు వెలువడే లోపు ప్రస్తుతం రెండో సంవత్సరం పరీక్షల కోసం ఎదురుచూస్తున్న 12 వేల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఫీజులు చెల్లించాలని, జూన్ రెండో వారంలో యూజీసీ నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని 26 స్టడీసెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పరీక్షల్లో చూచిరాతలకు అనుకూలంగా ఉండే సిబ్బంది, ఇన్విజిలేటర్ల జాబితాను సిద్ధం చేసి అనుమతి కోసం పరీక్షల విభాగానికి పంపినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
1972లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరస్పాండెన్స్ పేరుతో ఎస్వీయూలో దూరవిద్యా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. 1995లో యూజీసీ నిబంధనలు అనుసరించి డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(డీడీఈ)గా అభివృద్ధి చేశారు. డీడీఈ కేంద్రం ద్వారా 20 పీజీ కోర్సులు, ఐదు డిగ్రీ, రెండు డిప్లోమా కోర్సులను అందిస్తున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో(డెబ్) నిబంధనలు అనుసరించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకే పరిమితం కావడంతో 2016 నుంచి చిత్తూరు జిల్లాలోని 15 స్టడీసెంటర్లు, క్యాంపస్లోని నోడల్ కేంద్రం నుంచి మాత్రమే ప్రవేశాలు కల్పించేవారు. తెలుగు రాష్ట్రాల్లో 56 స్టడీసెంటర్లు మూతబడ్డాయి. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎస్వీయూతో పాటు కేవలం చిత్తూరు జిల్లాలోని స్టడీసెంటర్లలో మాత్రమే నిర్వహించారు.
ప్రవేశాలకు అవకాశం కల్పించిన సమయంలో..
ఎస్వీయూ దూరవిద్యా విభాగంలో రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన ప్రవేశాలను పునరుద్ధరించుకునేందుకు యూజీసీ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. నూతనంగా యూజీసీ డెబ్ అనుమతించే కోర్సులను ఎస్వీయూ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాదేశిక ప్రాంతంగా నిర్ణయిస్తూ ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గతంలో చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా యూజీసీ డెబ్ నిబంధనలకు అనుగుణంగా కోర్సులకు అనుమతి పొందాల్సిన సమయంలో ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రహస్యంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా మరోసారి ప్రవేశాలపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వైకాపా అధికారంలోకి వచ్చాక
2019లో ప్రభుత్వం మారగానే ఎస్వీయూ దూరవిద్యా కేంద్రంపైన కన్నేసిన కొందరు విశ్రాంత అధికారులు ఉచితంగా సేవలందిస్తామంటూ సలహాదారులుగా ప్రవేశించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని స్టడీసెంటర్ల ద్వారా ప్రవేశాలు కల్పించడమే కాకుండా అక్కడే పరీక్షలు నిర్వహించేలా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ప్రవేశాలు, పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం, ఇతర విశ్వవిద్యాలయాల నుంచి ఫిర్యాదులు అందడంతో క్షుణ్నంగా పరిశీలించిన యూజీసీ- డెబ్ రెండున్నరేళ్ల క్రితం ఎస్వీయూ దూరవిద్యా కేంద్రం ద్వారా ప్రవేశాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత భూ‘మేత’
[ 27-07-2024]
పుంగనూరులో రూ.5 కోట్ల విలువైన భూమిని వైకాపా నేతలు ఆక్రమించి.. రోడ్డు వేశారని ఓ మహిళ వాపోయారు. -
‘కోశలనగరం’పై కోటి ఆశలు!
[ 27-07-2024]
రెండు మహా నగరాలకు జిల్లా చేరువగా ఉంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయం సమీపంలోనే ఉన్నాయి. -
ఎన్టీఆర్ ట్రస్టుతో విస్తృత సేవా కార్యక్రమాలు
[ 27-07-2024]
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆంధ్రా, తెలంగాణలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. -
అప్పు తెచ్చి.. నగలు తాకట్టుపెట్టి..
[ 27-07-2024]
సులువుగా ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. రెట్టింపు నగదు పొందవచ్చని అత్యాశకు లోనుచేశారు.. అనేక మంది ఇలా సంపాదిస్తున్నారని మిగిలిన వారిని బుట్టలో వేశారు. -
కృత్రిమ కాలుకు ఆదరణ
[ 27-07-2024]
పుట్టుకతో దివ్యాంగులుగా మారటం.. వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవటం.. ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించటం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిక కాలు అమర్చి వారి నడిచేలా తోడ్పాటు అందిస్తున్నారు ఫ్రీడం ట్రస్టు నిర్వాహకులు. -
గంజాయి కోరల్లో.. తిరునగరి
[ 27-07-2024]
గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరునగరి గంజాయి గుప్పు గుప్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
దర్శనాలకే పర్యటనలు!
[ 27-07-2024]
రేణిగుంట రైల్వేజంక్షన్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 80 వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు, సుమారు 40 సరకు రవాణా రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. -
మీ అబ్బాయి.. మా కస్టడీలో ఉన్నాడు
[ 27-07-2024]
‘నేను పోలీసు అధికారిని మాట్లాడుతున్నా.. మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడు.. కేసు నమోదు చేసి జైలుకు పంపకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని, ఏదైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఓ తండ్రికి వాట్సప్ కాల్ చేసిన సంఘటన శుక్రవారం పుత్తూరులో జరిగింది. -
కదులుతున్న రైలు కిందపడి ఆత్మహత్య
[ 27-07-2024]
తిరుపతి రైల్వేస్టేషన్లో కదులుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.