logo

తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..

ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ.

Published : 18 May 2024 03:02 IST

భార్యాపిల్లలను బస్సెక్కించి వస్తూ కూలీ మృతి

నానిబాబు (పాతచిత్రం)

గొల్లప్రోలు, న్యూస్‌టుడే : ఊరెళ్తున్న భార్యాపిల్లలను అప్పుడే బస్సెక్కించాడు. పనిమీద వేరే గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు ఓ దినసరి కూలీ. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామ శివారు 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన చెప్పుల నానిబాబు(34) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఎస్సై బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. చెందుర్తి గ్రామానికి చెందిన నానిబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరగా గురువారం రాత్రి చెందుర్తి వద్ద బస్‌ ఎక్కించాడు. అక్కడ్నుంచి వేరే పనిమీద ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగివస్తుండగా.. వన్నెపూడి కూడలి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి నానిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని