పారితోషికం ఖరారు.. ఒకరోజు తఖరారు..!
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు.
13న మగసానితిప్పకు గోదావరిలో పడవపై వెళ్తున్న సిబ్బంది
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన తమకు రెమ్యూనరేషన్(పారితోషికం), టీఏ, డీఏ చెల్లింపుల్లో అన్యాయం జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మారుమూల పల్లెలకు వెళ్లి సక్రమంగా ఎన్నికలను పూర్తి చేసినా తమ పట్ల రిటర్నింగ్ అధికారులు చిన్నచూపే చూశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, భోజనం, అల్పాహారం, స్నాక్స్ సమకూర్చేందుకు బీఎల్వోలకు పూర్తి స్థాయిలో చెల్లింపు చేయలేదని వారూ మండిపడుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా 1,644 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు మొత్తం అన్నిరకాల అధికారులు కలిపి 11,853 మందిని నియమించారు. కానీ వీరిలో పీవో, ఏపీవోలకు ఒకలా, ఓపీవోలకు మరో విధంగా రెమ్యూనరేషన్ అందించారు. పీవో, ఏపీవోలకు రోజుకు రూ.350 చొప్పున ఆరు రోజులకు రూ.2,100 పారితోషికం అందించాలి. కానీ అయిదు రోజులకు మాత్రమే రూ.1,750 ఇచ్చి ఒక రోజు కోత పెట్టారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసిన రోజు అర్ధరాత్రి వరకు ఎన్నికల విధుల్లోనే ఉన్నారు. కొన్నిచోట్ల మరుసటి రోజు తెల్లవారిన తరువాత కూడా సామగ్రి అధికారులకు అందజేసిన తరువాత ఇళ్లకు చేరుకున్నారు.
పోలింగ్ రోజే నగదు
పోలింగ్ రోజున రూట్ ఆఫీసర్లు సాయంత్రంలోగా వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో చెల్లింపులు చేశారు. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని సిబ్బంది వాపోతున్నారు. డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పీవో, ఏపీవోలకు రూ.1,750, ఓపీవోలకు రూ.1,000 చొప్పున ఇచ్చారు. కాకినాడ జిల్లాలో పీవో, ఏపీవోలకు రూ.2,100 ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ వ్యత్యాసం ఏంటని ఉద్యోగులు, సంఘాల నాయకులు అభ్యంతరం చెబుతున్నారు.
బీఎల్వోలకు చెల్లింపుల్లోనూ..
ఒక్కో కేంద్రం వద్ద ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బందికి భోజనాలు, ఇతర వసతుల కల్పనకు ఎన్నికల సంఘం రూ.8 వేలు కేటాయించింది. ఈ మొత్తంలో జిల్లావ్యాప్తంగా బీఎల్వోలకు రూ.5 వేలకు మించి ఇవ్వలేదు. పంచాయతీల నుంచి షామియానా, విద్యుత్తు సౌకర్యం వంటివి కల్పించారు. మరోవైపు ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలకు ఇప్పటివరకు పైసా చెల్లించలేదు.
అధికారుల దృష్టికి..
ఈ సమస్యను ఉపాధ్యాయ సంఘాలవారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం బయటకు వెల్ల్లడించొద్దని, ఆరో రోజుకు కూడా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇతర ఉద్యోగ సంఘాలూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తామంటున్నాయి.
జిల్లాలో విధుల వివరాలు
పీవోలు: 1,911
ఏపీవోలు: 1,934
సూక్ష్మ పరిశీలకులు: 517
జీపీవోలు: 7,491
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
[ 27-07-2024]
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..