అదే నిర్లిప్తత!
కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటేయనివారు 8.78 లక్షల మంది
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిమిత సంఖ్యలో ఓటర్లు
ఈనాడు, కాకినాడ: కొందరు శ్రద్ధతో ఓటేశారు.. ఇంకొందరు కడుపు మండి ఆక్రోశంతో మీట నొక్కారు.. మరికొందరు ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి తమ హక్కు వినియోగించుకున్నారు. మునుపటి ఎన్నికలతో పోలిస్తే ఈ సార్వత్రిక సమరంలో భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడానికి కారణం ఇదే. ఓటరులో వెల్లివిరిసిన చైతన్యంపై అంతటా చర్చసాగుతోంది. ఇదే సమయంలో కీలక ఎన్నికల్లో విలువైన అస్త్రాన్ని వినియోగించుకోవడంలో కొందరు నిర్లిప్తత ప్రదర్శించారు. కాకినాడ, తూర్పు గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఏకంగా 8.78 లక్షల మంది ఓటేయలేదు. ఎన్నికల పండగకు దేశ, విదేశాల నుంచి రెక్కలు కట్టుకువచ్చి మరీ ఓటేస్తే.. వీరిలో మాత్రం ఎందుకింత నిస్తేజం.. పాలకులను ప్రశ్నించే, సమర్థ నాయకులను గద్దెను ఎక్కించే ఓటు వినియోగంలో ఎందుకింత నిర్లక్ష్యమనే అభిప్రాయం వినిపిస్తోంది.
- అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.84 శాతం పోలింగ్ నమోదయ్యింది. అమలాపురం లోక్సభ పరిధిలో మొత్తం ఓటర్లు 15.31 లక్షల మంది ఉంటే.. 12.84 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16.16 శాతం మంది చేజార్చారు.
- తూర్పుగోదావరి జిల్లాలో 80.93 శాతం పోలింగ్ నమోదయ్యింది. రాజమహేంద్రవరం లోక్సభ పరిధిలో 16.23 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 13.13 లక్షల మంది ఓటేశారు. ఇక్కడ ఓటు వేయనివారు 19.07 శాతం.
- కాకినాడ జిల్లా/ లోక్సభ పరిధిలో 16.34 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 13.12 లక్షల మంది ఓటేేశారు. ఇక్కడ వినియోగించుకున్నవారి శాతం 80.30 ఉంటే.. ముందుకురానివారు 19.70 శాతం.
- ఇతర ఓటర్ల హక్కు వినియోగం కోనసీమలో 52.38 శాతం ఉంటే.. కాకినాడ జిల్లాలో 54.84, తూర్పులో 59.79 శాతం ఉంది. పిఠాపురం, రాజానగరం, రామచంద్రపురం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో ఇతరులు శతశాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గుతున్న వరద.. తేలుతున్న లంకలు
[ 26-07-2024]
గోదావరికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో తాళ్లపూడి మండలంలోని లంక భూములు తేలుతున్నాయి. -
ప్రత్తిపాడులో బంగారం చోరీ
[ 26-07-2024]
ప్రత్తిపాడులోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
ముంపు వీడక.. బతుకు సాగక
[ 26-07-2024]
గోదావరి వరదలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంకల్లోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి. -
గోకులాలు వచ్చేస్తున్నాయ్..
[ 26-07-2024]
పశువులకు సంబంధించి గోకులాల పేరిట షెడ్లు నిర్మించేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పశుసంవర్థకశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. -
వర్షాకాలం.. డెంగీ భయం
[ 26-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. -
సంరక్షణ ఆ‘మడ’ దూరం!
[ 26-07-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లాలో మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. -
నరసన్నా.. అభివృద్ధి జాడ కనవా!
[ 26-07-2024]
రాష్ట్రాలే గాక ఇతర ప్రాంతాల నుంచి సైతం నిత్యం భక్తజనం పెద్దఎత్తున తరలివస్తుంటారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ దేవస్థానం నేడు అభివృద్ధి జాడలేక భక్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఒక ఇన్ఛార్జి వీసీ.. అయిదుగురు సలహాదారులు
[ 26-07-2024]
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) అయిదుగురు సలహాదారులను నియమించింది. వీరు వీసీకి సలహాదారులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రార్ సుమలత ఉత్తర్వులు జారీ చేశారు. -
అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు
[ 26-07-2024]
ఈ ఏడాది పొగాకు రైతులకు కాసుల పంట పండింది. ఓవైపు మంచి ధర వస్తుండగా, మరోవైపు పంట ఉత్పత్తి పరిమాణం పెంచుతూ కేంద్రం ఆదేశించింది. -
విమాన గోపురం.. సువర్ణశోభితం
[ 26-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
ఆవ భూములు చూద్దాం!
[ 26-07-2024]
ఆవ భూములు.. ఈ పేరు వినని వారుండరు. మూడేళ్లుగా వీటిపై వివాదం రేగుతూనే ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లస్థలాల కోసం సేకరించారు. -
గురి ఉంది.. గుర్తింపే లేకుంది
[ 26-07-2024]
విశ్వవ్యాప్త క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగేవి ఒలింపిక్స్. ఈ పోటీల్లో పాల్గొనటం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఉమ్మడి జిల్లా నుంచి సాత్విక్ జయరాజ్ ఈ పోటీల్లో మరోసారి ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు. -
భావనగర్-కాకినాడ పోర్టు రైలు దారి మళ్లింపు
[ 26-07-2024]
భావనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే రైలు(12756) దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
నిండా మునిగిన ఉద్యాన రైతు
[ 26-07-2024]
భారీ వర్షాలకు పోటెత్తుతున్న గోదావరి కోనసీమ లంకల్లోని ఉద్యాన రైతును నిండా ముంచేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్తున్న జలాలు లంకలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టాల్ని మిగిల్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు