అంగన్వాడీల నిరసన గళం
వేతనాలు పెంచుతామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు
కలెక్టరేట్ ముట్టడికి యత్నం.. అడ్డుకుంటున్న పోలీసులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: వేతనాలు పెంచుతామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించి, అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ.. కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు. స్థానిక జడ్పీ కూడలి నుంచి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా బారికేడ్లు, రోప్ పార్టీలు, ఏఎన్ఎస్ బలగాలతో పోలీసులు నిలువరించారు. దీంతో వందల సంఖ్యలో వచ్చిన అంగన్వాడీ సిబ్బంది బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నాయకులు దువ్వ శేషబాబ్జీ, సీహెచ్ రాజ్కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తకు రూ.13,550 వేతనం చెల్లిస్తుంటే.. ఆంధప్రదేశ్లో మాత్రం 11,500 మాత్రమే ఇస్తున్నారన్నారు. తెలంగాణ కంటే రూ.2 వేలు అధికంగా ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్రెడ్డి ఇచ్చిన హామీ నాలుగేళ్లవుతున్నా అమలు చేయలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గ్రాట్యూటీని ఇక్కడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లకు మొయిన్ వర్కర్లుగా మార్చి వేతనం చెల్లించాలన్నారు. ముఖ హాజరు విధానం రద్దు చేయాలని, బిల్లులు సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై దుర్భాషలాడిన సామర్లకోట సీఐ దుర్గాప్రసాద్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో ఒకటో పట్టణ సీఐ కృష్ణ చర్చలు జరిపి, నిరసన విరమించాలని కోరడంతో అంతా వెళ్లిపోయారు. కార్యక్రమంలో మలకా వెంకటరమణ, ఎంకే జ్యోతి, దీప్తి, రాధ, సత్యవేణి, నాగమణి, సుప్రియ, ప్రేమజ్యోతి, వెంకటలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్తిపాడులో బంగారం చోరీ
[ 26-07-2024]
ప్రత్తిపాడులోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. -
ముంపు వీడక.. బతుకు సాగక
[ 26-07-2024]
గోదావరి వరదలు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లంకల్లోని ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా నీరు చేరి బాహ్య ప్రపంచంలోకి రాలేని పరిస్థితి. -
గోకులాలు వచ్చేస్తున్నాయ్..
[ 26-07-2024]
పశువులకు సంబంధించి గోకులాల పేరిట షెడ్లు నిర్మించేందుకు రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు పశుసంవర్థకశాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. -
వర్షాకాలం.. డెంగీ భయం
[ 26-07-2024]
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. -
సంరక్షణ ఆ‘మడ’ దూరం!
[ 26-07-2024]
జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా.. పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఉమ్మడి జిల్లాలో మడ వనాల విధ్వంసం ఆగడంలేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. -
నరసన్నా.. అభివృద్ధి జాడ కనవా!
[ 26-07-2024]
రాష్ట్రాలే గాక ఇతర ప్రాంతాల నుంచి సైతం నిత్యం భక్తజనం పెద్దఎత్తున తరలివస్తుంటారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఈ దేవస్థానం నేడు అభివృద్ధి జాడలేక భక్తులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఒక ఇన్ఛార్జి వీసీ.. అయిదుగురు సలహాదారులు
[ 26-07-2024]
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) అయిదుగురు సలహాదారులను నియమించింది. వీరు వీసీకి సలహాదారులుగా వ్యవహరిస్తారని రిజిస్ట్రార్ సుమలత ఉత్తర్వులు జారీ చేశారు. -
అదనపు పొగాకు ఉత్పత్తిపై జరిమానా రద్దు
[ 26-07-2024]
ఈ ఏడాది పొగాకు రైతులకు కాసుల పంట పండింది. ఓవైపు మంచి ధర వస్తుండగా, మరోవైపు పంట ఉత్పత్తి పరిమాణం పెంచుతూ కేంద్రం ఆదేశించింది. -
విమాన గోపురం.. సువర్ణశోభితం
[ 26-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
ఆవ భూములు చూద్దాం!
[ 26-07-2024]
ఆవ భూములు.. ఈ పేరు వినని వారుండరు. మూడేళ్లుగా వీటిపై వివాదం రేగుతూనే ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్లస్థలాల కోసం సేకరించారు. -
గురి ఉంది.. గుర్తింపే లేకుంది
[ 26-07-2024]
విశ్వవ్యాప్త క్రీడా పోటీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగేవి ఒలింపిక్స్. ఈ పోటీల్లో పాల్గొనటం ప్రతి క్రీడాకారుడి స్వప్నం. ఉమ్మడి జిల్లా నుంచి సాత్విక్ జయరాజ్ ఈ పోటీల్లో మరోసారి ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు. -
భావనగర్-కాకినాడ పోర్టు రైలు దారి మళ్లింపు
[ 26-07-2024]
భావనగర్ నుంచి కాకినాడ పోర్టుకు వచ్చే రైలు(12756) దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
నిండా మునిగిన ఉద్యాన రైతు
[ 26-07-2024]
భారీ వర్షాలకు పోటెత్తుతున్న గోదావరి కోనసీమ లంకల్లోని ఉద్యాన రైతును నిండా ముంచేసింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్తున్న జలాలు లంకలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఉద్యాన పంటలు ముంపునకు గురై నష్టాల్ని మిగిల్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్