AP Elections: వీరిలో కట్టప్పలు ఎవరు?
అంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఆశించిన అభ్యర్థులందరికీ టికెట్లు సాధ్యం కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే జరిగింది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు. కొందరైతే అదును చూసుకుని దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నారు.
అభ్యర్థులను వెంటాడు తున్న అసంతృప్తుల గుబులు
అగ్రనేతల హామీలు.. బుజ్జగింపుల పర్వం
ఈనాడు, కాకినాడ
అంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఆశించిన అభ్యర్థులందరికీ టికెట్లు సాధ్యం కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే జరిగింది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు. కొందరైతే అదును చూసుకుని దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నారు. ఎంతగా సర్దిచెబుతున్నా ఎన్నికల్లో వీరు ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకం. కట్టప్పలు ఎవరో తేలక మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్కు నెలన్నరపైనే గడువు ఉండడంతో అసంతృప్తితో రగిలిపోతున్నవారిని ఓ వైపు బుజ్జగించే చర్యలు ముమ్మరమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలోని మూడు లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో విజయబావుటా ఎగరవేయాలనే తలంపుతో అన్ని పార్టీలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతికూలతలు వెంటాడుతున్నాయి. అధికార పార్టీకి ప్రజావ్యతిరేకత, అంతర్గత పోరు సవాలుగా మారింది. ఇప్పటికే వైకాపా నేతలు తాయిలాలతో ఓటర్లను, కీలక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తెదేపా- జనసేన- భాజపా కూటమి అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకోవడంతో ఇంటిపోరు చక్కదిద్దుకుని ఓటర్ల ప్రసన్నానికి క్షేత్ర స్థాయిలోకి కదిలేందుకు దృష్టిసారించారు.
ఇంటి‘పోరు’.. ఇంతింత కాదయా!
- పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. కాకినాడ ఎంపీ వంగా గీతను వైకాపా అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. అప్పట్నుంచి అంటీముట్టనట్లు పెండెం వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీలో ఉండడంతో ఫ్యాను పార్టీలో ఆందోళన మొదలైంది. దీంతో వైకాపా అధ్యక్షుడు జగన్.. దొరబాబును పిలిపించుకుని భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. తనకే పొగపెడతారా అని లోలోన రగిలిపోతున్న ఈయన ఏమేరకు సహకరిస్తారో చూడాల్సిందేనన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. తెదేపా పిఠాపురం ఇన్ఛార్జి వర్మ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించినా.. అనూహ్యంగా జనసేనాని తెరమీదికి వచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు వర్మను పిలిపించి తొలి జాబితాలోనే ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు భవిష్యత్తుకూ భరోసా ఇవ్వడంతో పవన్ విజయానికి కృషిచేస్తానని ప్రకటించారు.
- కాకినాడ గ్రామీణంలో వైకాపా టికెట్ పితాని అన్నవరం ఆశించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించడమే లక్ష్యంగా అదే పార్టీకి చెందిన మరోనేత పావులు కదుపుతున్నారు. ఈయనే రానున్న ఎన్నికల్లో పితానికి తెరవెనుక ఊతమిస్తారనే చర్చ నడుస్తోంది. ఇక్కడ తెదేపా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్తకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యత అప్పగించి అధిష్ఠానం అసంతృప్తికి తెరదించింది. దీంతో జనసేన అభ్యర్థి పంతం నానాజీతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.
- రాజోలు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే రాపాక వర్గానికి, టికెట్ దక్కిన గొల్లపల్లి వర్గానికి పొసగడంలేదు. రాపాకను అమలాపురం లోక్సభకు పంపి.. రాజోలులో గొల్లపల్లి సూర్యారావును అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది. రాపాక జనసేన నుంచి నెగ్గాక పవన్కు హ్యాండిచ్చి వైకాపాతో జత కట్టారు. ఈ పరిస్థితి మింగుడుపడని జనసైనికులు ఇప్పుడు లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రాపాకకు దీటైన సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
- ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, వైకాపా అభ్యర్థి వరుపుల సుబ్బారావు మధ్య పూడ్చలేని దూరం పెరిగింది.
జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన అధిష్ఠానం మాజీ ఎంపీ తోట నరసింహంను అభ్యర్థిగా దింపింది. సమన్వయకర్తగా నియమించిన అనంతరం తోట తీరుపై బాహాటంగానే విమర్శించిన చంటిబాబు..ఈ ఎన్నికల్లో చెక్పెట్టే వ్యూహంలో ఉన్నారు. చంటిబాబు వ్యతిరేకంగా పనిచేస్తే.. రానున్న ఎన్నికల్లో వైకాపాకు కష్టకాలమే అనే వాదన వినిపిస్తోంది.
కాకినాడ నగరంలో అధికార పార్టీ నేతలకు కబ్జాలు, దౌర్జన్యాలు మచ్చగా మారాయి. ప్రచారం ప్రారంభం రోజే నిలదీత శ్రేణులకు మింగుడు పడడంలేదు. గత ఎన్నికల్లో తెదేపా కోటకు వ్యూహాత్మకంగా బీటలు వేసిన వైకాపా నేతలు.. ఇప్పుడూ అదే ప్రణాళికలో ఉన్నారు. తెదేపాలోని అసంతృప్తులను దరిచేర్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వైకాపా ఉచ్చులో పడవద్దని పలువురు వీరికి సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తాం: పవన్ కల్యాణ్
[ 28-04-2024]
ఎల్లుండి (ఈనెల 30)న ఎన్డీయే కూటమి మేనిఫెస్టో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. -
వైకాపా మేనిఫెస్టో అంతా బూటకం
[ 28-04-2024]
వైకాపా ఎన్నికల మేనిపెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, అదంతా బూటకమని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
నిలదీద్దాం.. వైకాపాను గద్దె దించేద్దాం
[ 28-04-2024]
కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెం, పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో శనివారం రాత్రి నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అధికార పార్టీ నేతల అరాచకాలపై నిప్పులు చెరిగారు. -
మత్స్యకార కుటుంబాల కల.. మాటలతో వైకాపా వల
[ 28-04-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులో హార్బర్.. 20 వేల మత్స్యకార కుటుంబాల కల. ఇది అందు బాటులోకి వస్తే కష్టాలన్నీ తీరిపోయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. వైకాపా సర్కారు దీనిపై ఎన్నో గొప్పలు చెప్పింది. -
వేణుగోపాలా.. ఇదేం మాయ?
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికారపక్షం ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం తీరును ఎన్నికల సంఘం తప్పుపడుతున్నా.. అధికార పక్షానికి అంటకాగుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. -
జగనన్న సైనికులకు ఝలక్
[ 28-04-2024]
స్థానికంగా వాలంటీరు ఉద్యోగం వచ్చింది. కుటుంబంతో ఉంటూ ఊళ్లోనే ఇప్పటివరకు పనిచేసుకున్నా. అందులో భాగంగా రేషను పంపిణీలో భాగస్వామ్యం చేశారు. -
16,23,149.. ఇదీ ఓటర్ల సంఖ్య
[ 28-04-2024]
జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండవ అనుబంధ జాబితా(సప్లిమెంటరీ)ను కూడా ప్రచురించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే మొత్తం ఓటర్ల వివరాలను శనివారం కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. -
ప్రలోభాలపై నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న దృష్ట్యా విధి నిర్వహణలో యంత్రాంగం మరింత నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రలోభాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని -
మహిళా గళం.. విజయపథం
[ 28-04-2024]
తెదేపా- జనసేన- భాజపా కూటమి నేతృత్వంలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ శనివారం రాజమహేంద్రవరంలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. -
అయిదేళ్లలో ఆర్టీసీ ఆస్తవ్యస్తం
[ 28-04-2024]
జగన్ పాలనలో అన్ని వ్యవస్థల మాదిరిగానే ఆర్టీసీ సైతం చితికిపోయింది. ప్రభుత్వంలో విలీనం పేరిట ఆశలు కల్పించిన సీఎం.. తర్వాత అచేతన స్థితిలో వదిలేశారు. -
మా అందరి స్వస్థలం పిఠాపురం
[ 28-04-2024]
తమ స్వస్థలం పిఠాపురంగా భావిస్తున్నామని మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్తేజ్ అన్నారు. పి -
జగనన్నా.. ఇదేనా ‘మీ సేవ’..!
[ 28-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 215 మీసేవ కేంద్రాలు ఉండేవి. -
ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అధికారులకు సహకరిస్తాం..
[ 28-04-2024]
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యానాంలో మద్యం అమ్మకాల నియంత్రణ, అక్రమ రవాణా జరక్కుండా తగిన చర్యలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిపాలనాధికారి ఆర్.మునిస్వామి తెలిపారు. -
సత్యదేవుని కల్యాణోత్సవాలపై సమీక్ష నేడు
[ 28-04-2024]
మే 18 నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఏర్పాట్లపై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. -
జగన్ను నమ్మకండి: గిడుగు
[ 28-04-2024]
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో కుమార్తె మృతి
[ 28-04-2024]
ద్విచక్ర వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొన్న ప్రమాదంలో కోమటి హర్షిణి (8) మృతిచెందగా తండ్రి సురేష్ తీవ్రగాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!