AP Elections: వీరిలో కట్టప్పలు ఎవరు?
అంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఆశించిన అభ్యర్థులందరికీ టికెట్లు సాధ్యం కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే జరిగింది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు. కొందరైతే అదును చూసుకుని దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నారు.
అభ్యర్థులను వెంటాడు తున్న అసంతృప్తుల గుబులు
అగ్రనేతల హామీలు.. బుజ్జగింపుల పర్వం
ఈనాడు, కాకినాడ
అంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఆశించిన అభ్యర్థులందరికీ టికెట్లు సాధ్యం కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ అదే జరిగింది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు ఉన్నారు. కొందరైతే అదును చూసుకుని దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నారు. ఎంతగా సర్దిచెబుతున్నా ఎన్నికల్లో వీరు ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకం. కట్టప్పలు ఎవరో తేలక మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్కు నెలన్నరపైనే గడువు ఉండడంతో అసంతృప్తితో రగిలిపోతున్నవారిని ఓ వైపు బుజ్జగించే చర్యలు ముమ్మరమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలోని మూడు లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో విజయబావుటా ఎగరవేయాలనే తలంపుతో అన్ని పార్టీలూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతికూలతలు వెంటాడుతున్నాయి. అధికార పార్టీకి ప్రజావ్యతిరేకత, అంతర్గత పోరు సవాలుగా మారింది. ఇప్పటికే వైకాపా నేతలు తాయిలాలతో ఓటర్లను, కీలక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తెదేపా- జనసేన- భాజపా కూటమి అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకోవడంతో ఇంటిపోరు చక్కదిద్దుకుని ఓటర్ల ప్రసన్నానికి క్షేత్ర స్థాయిలోకి కదిలేందుకు దృష్టిసారించారు.
ఇంటి‘పోరు’.. ఇంతింత కాదయా!
- పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. కాకినాడ ఎంపీ వంగా గీతను వైకాపా అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. అప్పట్నుంచి అంటీముట్టనట్లు పెండెం వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీలో ఉండడంతో ఫ్యాను పార్టీలో ఆందోళన మొదలైంది. దీంతో వైకాపా అధ్యక్షుడు జగన్.. దొరబాబును పిలిపించుకుని భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. తనకే పొగపెడతారా అని లోలోన రగిలిపోతున్న ఈయన ఏమేరకు సహకరిస్తారో చూడాల్సిందేనన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. తెదేపా పిఠాపురం ఇన్ఛార్జి వర్మ ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించినా.. అనూహ్యంగా జనసేనాని తెరమీదికి వచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు వర్మను పిలిపించి తొలి జాబితాలోనే ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు భవిష్యత్తుకూ భరోసా ఇవ్వడంతో పవన్ విజయానికి కృషిచేస్తానని ప్రకటించారు.
- కాకినాడ గ్రామీణంలో వైకాపా టికెట్ పితాని అన్నవరం ఆశించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించడమే లక్ష్యంగా అదే పార్టీకి చెందిన మరోనేత పావులు కదుపుతున్నారు. ఈయనే రానున్న ఎన్నికల్లో పితానికి తెరవెనుక ఊతమిస్తారనే చర్చ నడుస్తోంది. ఇక్కడ తెదేపా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్తకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యత అప్పగించి అధిష్ఠానం అసంతృప్తికి తెరదించింది. దీంతో జనసేన అభ్యర్థి పంతం నానాజీతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.
- రాజోలు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే రాపాక వర్గానికి, టికెట్ దక్కిన గొల్లపల్లి వర్గానికి పొసగడంలేదు. రాపాకను అమలాపురం లోక్సభకు పంపి.. రాజోలులో గొల్లపల్లి సూర్యారావును అభ్యర్థిగా వైకాపా ప్రకటించింది. రాపాక జనసేన నుంచి నెగ్గాక పవన్కు హ్యాండిచ్చి వైకాపాతో జత కట్టారు. ఈ పరిస్థితి మింగుడుపడని జనసైనికులు ఇప్పుడు లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ రాపాకకు దీటైన సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నారు.
- ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, వైకాపా అభ్యర్థి వరుపుల సుబ్బారావు మధ్య పూడ్చలేని దూరం పెరిగింది.
జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన అధిష్ఠానం మాజీ ఎంపీ తోట నరసింహంను అభ్యర్థిగా దింపింది. సమన్వయకర్తగా నియమించిన అనంతరం తోట తీరుపై బాహాటంగానే విమర్శించిన చంటిబాబు..ఈ ఎన్నికల్లో చెక్పెట్టే వ్యూహంలో ఉన్నారు. చంటిబాబు వ్యతిరేకంగా పనిచేస్తే.. రానున్న ఎన్నికల్లో వైకాపాకు కష్టకాలమే అనే వాదన వినిపిస్తోంది.
కాకినాడ నగరంలో అధికార పార్టీ నేతలకు కబ్జాలు, దౌర్జన్యాలు మచ్చగా మారాయి. ప్రచారం ప్రారంభం రోజే నిలదీత శ్రేణులకు మింగుడు పడడంలేదు. గత ఎన్నికల్లో తెదేపా కోటకు వ్యూహాత్మకంగా బీటలు వేసిన వైకాపా నేతలు.. ఇప్పుడూ అదే ప్రణాళికలో ఉన్నారు. తెదేపాలోని అసంతృప్తులను దరిచేర్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వైకాపా ఉచ్చులో పడవద్దని పలువురు వీరికి సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
[ 27-07-2024]
ఇలా ఎన్నో మాయమాటలతో కొందరు దళారులు, నకిలీ ఏజెంట్లు ఉపాధి వల విసురుతూ రూ.లక్షల్లో పిండేస్తున్నారు. -
సరిపడక.. సర్దేస్తున్నారు..
[ 27-07-2024]
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లో పరిస్థితి ఇది. జిల్లా ప్రజలతోపాటు కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. -
హలధారి.. ఆశలు ఆవిరి
[ 27-07-2024]
వానొస్తే వణుకు.. వరదొస్తే బతుకు బితుకు.. గోదావరి నదీపరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఇది. -
చదువులమ్మ నీడలో అక్రమాల చీడ
[ 27-07-2024]
కళాశాల రికార్డుల్లో ఒక లెక్క.. గవర్నింగ్ బాడీ సమావేశంలో మరో లెక్క.. మాటల్లో చెప్పిందొకటి.. లెక్కల్లో చూపింది మరొకటి. పరీక్ష పేపర్ల రూపకల్పన.. ముద్రణ ఖర్చులు.. సదస్సులు పేరిట భోజనాల బిల్లులు.. అన్నీ మాయే. -
ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలొచ్చాయ్
[ 27-07-2024]
గత వైకాపా పాలనలో పూర్తిగా గాడితప్పిన విద్యావ్యవస్థను సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేసిన తొలి అడుగుగా దీనిని చెప్పుకోవచ్చు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
గతుకుల మార్గం.. దినదిన గండం
[ 27-07-2024]
ఆ మార్గంలో ప్రయాణమంటే అమ్మో అనాల్సిందే. మామూలు రోజుల్లో దుమ్ము, ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వానాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. ఎక్కడ గొయ్యి ఉందో చెప్పలేని పరిస్థితి. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ.2.20 కోట్లతో పరారీ
[ 27-07-2024]
ఏటీఎంలో నింపేందుకు తీసుకున్న రూ.2.20 కోట్లతో సదరు ఏజెన్సీ ఉద్యోగి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం కలకలం రేపింది. -
తహసీల్దారు సంతకం ఫోర్జరీ.. నకిలీ పట్టాల సృష్టి
[ 27-07-2024]
కాకినాడ జిల్లా పెద్దాపురంలో గతంలో మృతిచెందిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీచేసి కొందరు వైకాపా నాయకులు నకిలీ పట్టాలు సృష్టించారు. -
విమాన గోపురం సువర్ణశోభకు ప్రణాళిక
[ 27-07-2024]
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించడానికి అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం శుక్రవారం పరిశీలించింది. -
ఏసీ బోగీల్లోకి దొంగలు చొరబడ్డారు..
[ 27-07-2024]
గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథున్ని దర్శించుకోవాలని శిర్డీ వెళ్లిన పలువురు భక్తులు తిరుగు ప్రయాణంలో చోరీ ఘటనలో విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు పోగొట్టుకున్నారు. -
ఇళ్లవ్వాలి.. బిల్లివ్వాలి..
[ 27-07-2024]
గ్రామాల్లో ఇళ్లు కాదు.. ఏకంగా కాలనీలే నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలం చెందింది. -
ఒకరికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల ఇసుకే ఇస్తాం..
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా రోజుకు ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకరించండి
[ 27-07-2024]
రాజోలు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్తు సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గత ప్రభుత్వంలో ఖర్చు.. నేటి కౌన్సిల్ అజెండాలో బిల్లు..!
[ 27-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి 24న మంత్రి విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన ‘వైఎస్సార్ ఆసరా’ నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెండు విడతలుగా రూ.14.40 లక్షలు ఖర్చు చేశారు. -
వేతన బకాయిలు చెల్లించాలి: ఎమ్మెల్సీ ఐవీ
[ 27-07-2024]
ప్రకృతి వ్యవసాయ ఒప్పంద ఉద్యోగులకు 18 నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు.