ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
ఎర్రబాలెంలో మాట్లాడుతున్న నారా లోకేశ్
ఎర్రబాలెం(మంగళగిరి), న్యూస్టుడే: ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన ‘రచ్చబండ’ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళలను బూటు కాళ్లతో తన్నారని, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. పరదాల మాటున జగన్ సచివాలయానికి వెళుతున్నారని, అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఆ దుస్థితి తలెత్తేదా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని సీఎం రాజధాని రైతులను ఓట్లు అడుగుతారంటూ నిలదీశారు. అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారన్నారు. కేవలం అసంపూర్తిగా నిర్మించిన అయిదు శాతం రాజధాని పనులు పూర్తిచేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. అమరావతి ప్రాంతంలో ఇసుక, కంకర, మట్టితోసహా దోచుకెళ్లారన్నారు. పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులు, రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కౌలు వెంటనే చెల్లించే చర్యలు చేపడతానన్నారు. రాజధాని పనులు కొనసాగించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. పేదలకు పక్కాఇళ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
హాజరైన జనం
కక్షగట్టి పింఛన్ తీసేశారు..
రాజధానికి భూములిచ్చామని కక్ష కట్టి పెన్షన్లు తీసేశారని ఎర్రబాలెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అసైన్డ్ భూముల్లో నివసించే వారికి పట్టాలివ్వాలని కోరారు. ల్యాండ్ పూలింగ్కు సహకరించిన రైతుల పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాలు కల్పించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలపై స్పందించిన లోకేశ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఎలాంటి కోత లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తామన్నారు. కొండ పోరంబోకు, ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి ఉన్నచోటనే పట్టాలిప్పిస్తామని భరోసా ఇచ్చారు.
క్రైస్తవులను గుండెల్లో పెట్టుకుంటాం
కూటమి ప్రభుత్వం వస్తే క్రైస్తవులను ఇబ్బంది పెడుతుందని వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని నారా లోకేశ్ సూచించారు. మంగళగిరి మండలం చిన్నకాకాని ‘రచ్చబండ’లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భాజపాతో పొత్తుపెట్టుకున్నామని, క్రైస్తవ సోదరులను గుండెల్లో పెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. 2014లో భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎటువంటి సమస్యలు తలెత్తలేదన్నారు. క్రిస్మస్ కానుకలు, పాస్టర్లకు గౌరవ వేతనం, చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చామన్నారు. తెదేపాపై విషం చిమ్ముతున్న కాపు ముసుగు నేతలు రిజర్వేషన్లపై జగన్ను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక గతంలో తెదేపా ఇచ్చిన నిధుల్లో పది శాతం కూడా ఆ సామాజికవర్గానికి ఇవ్వలేదన్నారు. మరో 40 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానని, పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం తనకు లేదన్నారు. అధికారంలో లేకపోయినా సొంత డబ్బుతో నియోజకవర్గంలో 29 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?