ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి.
ఏం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని కొంతమంది పోలీసుల మథనం
జిల్లాలో అల్లర్లపై వందల కేసులు.. వీడియోలు, చిత్రాల ఆధారంగా గుర్తింపు
ఈనాడు, నరసరావుపేట: జిల్లాలో పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన దాడులు, ప్రతిదాడులకు సంబంధించి పోలీసులు పెద్దఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. అదనపు బలగాలు రావడంతో జిల్లా మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకోవడంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. ప్రశాంతత నెలకొనడంతో పోలీసులు దాడులకు బాధ్యులైన వారిని గుర్తించి వారిపై కేసులు పెడుతున్నారు. మరోవైపు పోలింగ్రోజు శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమైన పోలీసులు, పోలింగ్ అనంతరం హింసను అరికట్టలేకపోవడానికి కారణాలు, పోలీసుశాఖలో అధికార పార్టీకి సహకరిస్తూ దాడులను ప్రోత్సహించిన ఇంటి దొంగలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శనివారం మధ్యాహ్నం నుంచి విచారణ మొదలెట్టింది. దీంతో పల్నాడు జిల్లాలో అటు పోలీసుశాఖలోనూ, ఇటు కేసుల్లో ఉన్న బాధ్యుల్లోనూ అలజడి మొదలైంది.
సిట్ విచారణలో ఎవరిరెవరు దోషులుగా తేలుతారో అన్న విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుశాఖలో ఏ ఇద్దరు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన పోలీసు అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులపై ఎన్నికల సంఘం చర్య తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సిట్ విచారణ అత్యంత కీలకంగా మారింది. అధికార పార్టీతో అంటకాగి నిఘా సమాచారాన్ని చేరవేసి ఇతోధికంగా సాయమందించిన పోలీసులు ఇప్పుడు అంతర్గత విచారణతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం ఇంతదాకా వస్తుందని అనుకోలేదని, అత్యుత్సాహంతో వివాదాల్లో చిక్కుకున్నామని కొందరు పోలీసులు అంతర్మథనం చెందుతున్నారు. సిట్ విచారణలో బాధ్యులుగా తేలితే ఎన్నికల సంఘం చర్యలతోపాటు శాఖాపరమైన విచారణ ఎదుర్కొవాల్సి ఉంది.
నూజండ్ల మండలం ఉప్పలపాడులో పోలీసుల తనిఖీలు
అల్లర్లకు బాధ్యులైన వారిపై కేసులు
పల్నాడు జిల్లాలో అల్లర్లకు బాధ్యులైన వారిని గుర్తించి వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో ఘర్షణల్లో పాల్గొన్న వారిని గుర్తించి బాధ్యులపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ ముగిసి ఐదు రోజులైనా ఇప్పటి వరకు కేసుల నమోదుపై పెద్దగా దృష్టిసారించని యంత్రాంగం ఇప్పుడు జూలు విదుల్చుతోంది. ఘటన జరిగిన రోజు అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు, పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలు, వివిధ వర్గాల వారు ఘటనలు జరిగే సమయంలో చరవాణిలో తీసిన వీడియోలు, చిత్రాలు సేకరించి వాటి ఆధారంగా బాధ్యులను గుర్తిస్తున్నారు. తెదేపా, వైకాపా, జనసేన పార్టీలకు చెందినవారిని గుర్తించి వారిని బాధ్యులుగా చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం మొదలైంది. ఇప్పటికే పిన్నెల్లి సోదరులు అరెస్టు చేస్తారన్న భయంతో హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో మాచర్ల నియోజకవర్గంలో వైకాపాలో కీలక నేతలు అందరూ గ్రామాలు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఘర్షణల సందర్భంగా గ్రామాల్లో ఉన్నవారు అందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. అరెస్టులు ప్రారంభమైన విషయం తెలుసుకున్నవారు వివిధ మార్గాల్లో జిల్లా వదిలి వెళ్లిపోయారు. ఓట్ల లెక్కింపు వరకు తప్పించుకుంటే ఆ తర్వాత పరిస్థితులను అనుసరించి లొంగిపోవాలనే యోచనలో ఎక్కువమంది ఉన్నారు. కేసులు నమోదు చేసిన పోలీసులు గ్రామాలను జల్లెడ పడుతూ బాధ్యులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. దీంతో పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. ఘర్షణల సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా గ్రామస్థులు కొందరు వీడియోల్లో రికార్డు కావడంతో వారు కూడా తమను బాధ్యులను చేస్తారని భయపడుతున్నారు. ఏదీఏమైనా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఆరు రోజులు అవుతున్నా పల్నాడులో ఇంకా పాత పరిస్థితులు నెలకొనలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి ఇవ్వాలి
[ 26-07-2024]
నిరుద్యోగ యువతకు భృతిని ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
[ 26-07-2024]
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
[ 26-07-2024]
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
[ 26-07-2024]
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
ఏ ఎండకా గొడుగు!
[ 26-07-2024]
ప్రస్తుతం గుంటూరులో పని చేస్తున్న ఓ సీఐ వైకాపా హయాంలో ఒక ప్రజాప్రతినిధితో బాగా అంటకాగారు. ఈయనకు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడికి పంపేందుకు కూటమి నాయకుడొకరు పట్టుబడుతున్నారు. -
ఎందెందు వెదికినా.. ఈ కలుపు మందే!
[ 26-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఇందుకోసం కొంతమంది వ్యక్తులు అనేక అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు...నాటి జగన్ సర్కారు చేసిందిదే. -
ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా తిన్నదెవరు?
[ 26-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా సొమ్మును కాజేసిన వ్యవహారంపై ఇన్ఛార్జి వీసీ కె.గంగాధరరావు విచారణకు ఆదేశించారు. -
సేవలకు రాం రాం.. వసూళ్లకు పరిమితం
[ 26-07-2024]
రైతు సేవలకు నిర్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రుసుం వసూలు కేంద్రాలుగా మారాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాల్సిన యార్డులు రైతులకు దూరమయ్యాయి. -
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలకు దరఖాస్తు
[ 26-07-2024]
-
రూ.కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు
[ 26-07-2024]
నాణ్యమైన ఎర్రమట్టి.. ప్రభుత్వ భూములతోపాటు విస్తారంగా అటవీ భూములు.. ఎంత తవ్వినా అడిగేవారు ఉండరు.. అధికారపార్టీ నేతల అండతో తవ్వకాలు జరుగుతుండటంతో అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి.. డిమాండ్ లక్ష్యంగా ఎర్రమట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నారు -
ఇంట్లోకి చొరబడి బాలికతో అసభ్య ప్రవర్తన
[ 26-07-2024]
కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కామాంధుడు అర్ధరాత్రి ఒక బాలికను చెరబట్టబోయాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఊసరవెల్లి నయం
[ 26-07-2024]
వైకాపా పాలనలో కొంతమంది సీఐలు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తించారు. చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేసి వైకాపా సెక్షన్ల అమల్లో పోటీ పడ్డారు. ఖాకీల ముసుగులో నీలి మూకలుగా చెలరేగిపోయారు. -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
[ 26-07-2024]
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు
[ 26-07-2024]
రైతు భరోసా కేంద్రాల్లో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు చేయకుండా వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!