మీరు తెదేపాలోకి వెళితే నేను పోటీ చేయను!
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో గురువారం విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. మార్టూరుకు చెందిన పలువురు కీలక వైకాపా నాయకులు తెదేపాలో చేరుతున్నారనే విషయం తెలుసుకుని పర్చూరు వైకాపా అభ్యర్థి యడం బాలాజీ ఆగమేఘాలమీద గురువారం మార్టూరులోని పాండురంగస్వామి గుడి వద్దకు చేరుకున్నారు.
వైకాపా నాయకులతో పర్చూరు అభ్యర్థి యడం బాలాజీ
ససేమిరా అంటూ పార్టీని వీడారు
నేతలను పార్టీ వీడొద్దని కోరుతున్న అభ్యర్థి బాలాజీ
ఈనాడు-బాపట్ల, న్యూస్టుడే, మార్టూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో గురువారం విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. మార్టూరుకు చెందిన పలువురు కీలక వైకాపా నాయకులు తెదేపాలో చేరుతున్నారనే విషయం తెలుసుకుని పర్చూరు వైకాపా అభ్యర్థి యడం బాలాజీ ఆగమేఘాలమీద గురువారం మార్టూరులోని పాండురంగస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బాలాజీ సామాజికవర్గానికి చెందిన వారున్నారు. నాకు పార్టీ టిక్కెట్ ఇస్తే సొంత సామాజిక వర్గీయులైన మీరే కూటమిలో చేరితే నా పరిస్థితి ఏమిటి? మీరు ఎట్టి పరిస్థితుల్లో తెదేపాలో చేరొద్దని నాయకులను వారించారు. అయితే వారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వైకాపాలో ఉండలేం. పార్టీలో తమకు గౌరవం లేదు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ కూటమిలో ఉన్నారు. తెదేపాలో ఇప్పటికే తమ సామాజిక వర్గీయులకు ఎమ్మెల్యే సాంబశివరావు పార్టీ పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఆ పరిస్థితి వైకాపాలో లేదు. ఇక పార్టీలో ఉండలేం. వీడతామని ఖరాకండిగా చెప్పినా వినిపించుకోకుండా చేరే వారిని బయటకు వెళ్లనీయకుండా బాలాజీ తన వర్గీయులతో గుడి వద్దే నాలుగు గంటలపాటు ఉన్నారు. చివరకు వారు తాము పార్టీని వీడేదేనంటూ సుమారు వంద మంది ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కార్యాలయానికి బయలుదేరటంతో చేసేది లేక అప్పుడు బాలాజీ అక్కడి నుంచి వెనుదిరిగారు. మార్టూరు బలరాం కాలనీ ప్రాంతంలో కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా ఉన్నారు. ఆపై వీరు పార్టీలో చాలా కీలకమైన నాయకులు కావటం ఎన్నికల వేళ వైకాపాను వీడి తెదేపాలో చేరితే ఇక నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగైతే తాను పోటీ చేయలేనని బాలాజీ అన్నట్లు తెలిసింది. మీరు కూడా తమతో వస్తే పవన్ కల్యాణ్ సమక్షంలో కూటమిలో చేరదామని అన్నట్లు వినికిడి. తెదేపాలో చేరిన వారిలో సకల ఆంజనేయులు, ముప్పవరపు హనుమంతరావు, పెôట్యాల బుల్లయ్య, పవన్ తదితరులు ఉన్నారు. మూడురోజుల క్రితం ఇదే మండలం వలపర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లగా ఆ ఊళ్లో పార్టీకి చెందిన ఓ వర్గం నేతలు అందులో పాల్గొనలేదు. తమకు సమాచారమివ్వలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారి వద్దకు వెళ్లి మీరు తన వెంట రాకపోతే తాను పోటీ చేయబోనని బాలాజీ అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తంగా పర్చూరు నియోజకవర్గం నుంచి నానాటికీ తెదేపాలో చేరికలు ఎక్కువగా ఉండటంతో వైకాపా అభ్యర్థి ఆందోళన చెందుతున్నారు. చేరికలను నిలువరించటానికి నేను పోటీ చేయననని అంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి ఇవ్వాలి
[ 26-07-2024]
నిరుద్యోగ యువతకు భృతిని ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
[ 26-07-2024]
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
[ 26-07-2024]
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
[ 26-07-2024]
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
ఏ ఎండకా గొడుగు!
[ 26-07-2024]
ప్రస్తుతం గుంటూరులో పని చేస్తున్న ఓ సీఐ వైకాపా హయాంలో ఒక ప్రజాప్రతినిధితో బాగా అంటకాగారు. ఈయనకు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడికి పంపేందుకు కూటమి నాయకుడొకరు పట్టుబడుతున్నారు. -
ఎందెందు వెదికినా.. ఈ కలుపు మందే!
[ 26-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఇందుకోసం కొంతమంది వ్యక్తులు అనేక అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు...నాటి జగన్ సర్కారు చేసిందిదే. -
ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా తిన్నదెవరు?
[ 26-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా సొమ్మును కాజేసిన వ్యవహారంపై ఇన్ఛార్జి వీసీ కె.గంగాధరరావు విచారణకు ఆదేశించారు. -
సేవలకు రాం రాం.. వసూళ్లకు పరిమితం
[ 26-07-2024]
రైతు సేవలకు నిర్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రుసుం వసూలు కేంద్రాలుగా మారాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాల్సిన యార్డులు రైతులకు దూరమయ్యాయి. -
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలకు దరఖాస్తు
[ 26-07-2024]
-
రూ.కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు
[ 26-07-2024]
నాణ్యమైన ఎర్రమట్టి.. ప్రభుత్వ భూములతోపాటు విస్తారంగా అటవీ భూములు.. ఎంత తవ్వినా అడిగేవారు ఉండరు.. అధికారపార్టీ నేతల అండతో తవ్వకాలు జరుగుతుండటంతో అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి.. డిమాండ్ లక్ష్యంగా ఎర్రమట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నారు -
ఇంట్లోకి చొరబడి బాలికతో అసభ్య ప్రవర్తన
[ 26-07-2024]
కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కామాంధుడు అర్ధరాత్రి ఒక బాలికను చెరబట్టబోయాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఊసరవెల్లి నయం
[ 26-07-2024]
వైకాపా పాలనలో కొంతమంది సీఐలు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తించారు. చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేసి వైకాపా సెక్షన్ల అమల్లో పోటీ పడ్డారు. ఖాకీల ముసుగులో నీలి మూకలుగా చెలరేగిపోయారు. -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
[ 26-07-2024]
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు
[ 26-07-2024]
రైతు భరోసా కేంద్రాల్లో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు చేయకుండా వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి