జై బోలో మట్టి గణపతికీ!
వినాయక చవితి పండగ వచ్చేస్తోంది.. మరో 10 రోజుల్లో నవరాత్రుల సంరంభం ప్రారంభం కానుంది.. విగ్రహాల విక్రయాలు జరిపే ధూల్పేట్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మేడ్చల్, వనస్థలిపురం, నాగోల్ తదితర ప్రాంతాల్లో అప్పుడే సందడి కనిపిస్తోంది.
చెరువుల్లో పూడిక పెరుగుతుందనడం అపోహే
పీవోపీ విగ్రహాలతో జీవ వైవిధ్యానికి ముప్పు
వినాయక చవితి పండగ వచ్చేస్తోంది.. మరో 10 రోజుల్లో నవరాత్రుల సంరంభం ప్రారంభం కానుంది.. విగ్రహాల విక్రయాలు జరిపే ధూల్పేట్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మేడ్చల్, వనస్థలిపురం, నాగోల్ తదితర ప్రాంతాల్లో అప్పుడే సందడి కనిపిస్తోంది. మట్టి విగ్రహం కొనుగోలు చేయాలా.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహం కొనుగోలు చేయాలా.. అని వినాయక మండపాల నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు. మట్టి విగ్రహాల్లో దృఢత్వం ఉండదని, వాటి నిమజ్జనంతో జలాశయాలు, చెరువుల్లో పూడిక పెరుగుతుందని వారు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పీవోపీతో జలాశయాల్లో జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు.
ఈనాడు, హైదరాబాద్
పీవోపీతో నష్టమిదే.. : గతేడాది గ్రేటర్ పరిధిలో పీవోపీ విగ్రహాలతో 80వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తయ్యాయి. పీవోపీ, విగ్రహాలపై వేసిన రంగులు, రసాయనాలు నీటిలో కరగడంతో హానికర లోహాల పరిమాణం పెరుగుతోందని, ఇది జలచరాలకు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డిజాల్వ్డ్ ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ శాతం పడిపోవడంతో జలచరాలకు ఊపిరాడటం లేదని నివేదికల ద్వారా స్పష్టమవుతోంది
శాస్త్రీయత ఉంది: చెరువుల్లో లభించే మట్టి, బంకమట్టితో చేసే విగ్రహాలను పూజించడంలో కొంత శాస్త్రీయత ఉందని పెద్దలు చెబుతున్నారు. వర్షాకాలానికి ముందు జలాశయాల్లో నీరు లేకపోవడంతో పూడిక తీసేవారు. ఆ మట్టితోనే విగ్రహాలు తయారుచేసేవారు. తర్వాత వర్షాకాలంలో జలాశయాలు నిండిన తర్వాత ఆ విగ్రహాలను అందులో నిమజ్జనం చేయడంతో ఆ మట్టి అడుగు భాగానికి వెళ్లి నీళ్లు త్వరగా ఇంకకుండా చేస్తుందని చెబుతున్నారు.
ఉచితంగా ప్రతిమల పంపిణీ: మట్టి గణేశ్పై అవగాహన ప్రచారంలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ).. ప్రతి పారిశ్రామికవాడలో మట్టి విగ్రహాల పంపిణీ చేపడుతోంది. పీవోపీకి బదులుగా మట్టి ప్రతిమల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి జిల్లా పరిధిలో 1.2లక్షలకు పైగా విగ్రహాలు పంపిణీ చేయనుంది. జీహెచ్ఎంసీ 3.8లక్షలు, హెచ్ఎండీఏ వారు లక్ష విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
బరువు తక్కువ.. దృఢత్వం ఎక్కువ
మేము 15 ఏళ్లుగా మట్టి విగ్రహాలు తయారుచేస్తున్నాం. 70మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ముందుగా చెరువు మట్టిని తీసుకొచ్చి నానబెట్టి, ఫిల్టర్ చేసి పొడిలా మారుస్తాము.. కుంకుమ తరహాలో వచ్చేలా జల్లెడ, యంత్రాలు వాడుతాము. దృఢత్వం కోసం జనపనార ఉపయోగిస్తాం. మరింత గట్టిదనం కోసం పేపర్ పౌడర్ కలుపుతాం. దీంతో బరువు తక్కువగా, దృఢత్వం ఎక్కువగా ఉంటుంది.
స్వామి, మట్టి విగ్రహాల తయారీదారు
చాలా మందికి ఉపాధి
మట్టి విగ్రహాలతో పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది... మట్టితో చేసిన విగ్రహాలను పూజించి మళ్లీ వాటిలోనే నిమజ్జనం చేయడంతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. గతంలో చెరువులు కులవృత్తులకు ఆదరువుగా ఉండేవి. సీజన్ను బట్టి చెరువుల నుంచి మట్టి, చేపలు ఇతరత్రా వనరులను పొందేవారు. మట్టి విగ్రహాల తయారీతో పూడిక తీసేవారికి, విగ్రహాలు తయారుచేసే వారికి, వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. పీవోపీతో జల కాలుష్యం పెరుగుతుంది.
దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
[ 26-07-2024]
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
[ 26-07-2024]
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి