HYD News: కారుకు మహా కుదుపు.. కాంగ్రెస్లో చేరనున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి?
రాజధానిలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ శుక్రవారం స్వయంగా మేయర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమెతోపాటు పదిమంది భారాస కార్పొరేటర్లు సైతం!
ఎన్నికల నోటిఫికేషన్లోపు మరికొందరు..
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ శుక్రవారం స్వయంగా మేయర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని మేయర్ పదవికి భరోసా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మేయర్ చేరికతోపాటు మరో పది మంది కార్పొరేటర్లు కూడా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. నోటిఫికేషన్ నాటికి మరికొందరు కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో భారాసలో అలజడి నెలకొంది.
అవిశ్వాసం పెట్టినా.. వ్యూహరచన..
మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరితే భారాస పార్టీ అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉందని, దీని నుంచి బయటపడడానికి కూడా కాంగ్రెస్ వ్యూహరచన చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2020లో జరిగిన బల్దియా పాలకవర్గ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను భారాస 56, భాజపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మొన్నటి ఎన్నికల తరువాత పలువురు భారాస కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 10కి పెరిగింది. భారాస బలం 46కు తగ్గింది. తాజాగా మరో పది మందిని పార్టీలో చేర్చుకోనున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగా మరో 15 మందిని ఆకర్షించాలని సంబంధిత కార్పొరేటర్లతో మాట్లాడుతున్నారు. భాజపా నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్లను చేర్చుకోవాలని భావిస్తున్నారు. భారాస అవిశ్వాసం పెడితే ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉంది. ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇస్తే.. మేయర్ విజయలక్ష్మి హస్తం పార్టీలో చేరినా.. ఆమె పదవికి ఢోకా ఉండదని పార్టీ వర్గాల అంచనా.
బల్దియాపై కాంగ్రెస్ దృష్టి..
గ్రేటర్ పరిధిలో నాలుగు జిల్లాల్లోని 29 శాసనసభా నియోజకవర్గాల్లో మూడింటిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే నగరానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిని చేర్చుకుని అదే లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను చేర్చుకుని సికింద్రాబాద్ నుంచి, వికారాబాద్ జడ్పీఛైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో నిలిపింది. ఈ చేరికలు సరిపోవన్న ఉద్దేశంతో బల్దియా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించింది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి కాంగ్రెస్లో చేరారు. తాజాగా మేయర్తోపాటు మరికొందరు కార్పొరేటర్ల చేరికకు అంతా సిద్ధమైందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి