logo

భాజపాతోనే పాలమూరుకు నిధులు వచ్చేది

జిల్లాకు నిధులు నేరుగా రావాలంటే పాలమూరు పార్లమెంటు ఎన్నికల్లో డీకే.అరుణకు పట్టం కట్టాలని రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ అన్నారు.

Published : 21 Apr 2024 02:35 IST

మాట్లాడుతున్న నాగురావు నామాజీ  

కొడంగల్‌, న్యూస్‌టుడే: జిల్లాకు నిధులు నేరుగా రావాలంటే పాలమూరు పార్లమెంటు ఎన్నికల్లో డీకే.అరుణకు పట్టం కట్టాలని రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ అన్నారు. శనివారం కొడంగల్‌ వచ్చిన ఆయన భాజపా నాయకులు పున్నంచంద్‌ లాహోటి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలు మాట్లాడారు. డీకే అరుణ గెలిస్తే నిధులు నేరుగా పాలమూరు జిల్లాకు వస్తాయన్నారు.  పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతలకు ఏ నాడైనా ఎంపీˆగా పార్లమెంటులో ప్రశ్నించావా అని ముఖ్యమంత్రి నుద్దేశించి వ్యాఖ్యానించారు. వికారాబాద్‌- కృష్ణ రైల్వే లైన్‌కు 08.09.2023న ఫైనల్‌ లొకేషన్‌ సర్వే నిమిత్తం రూ.2,196 కోట్లకు టెండర్లు పిలవడం జరిగిందని తెలిపారు.   భాజపా నాయకులు బస్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని