పల్లె పోరుకు కసరత్తు
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూస్టుడే, వికారాబాద్: స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు గతంలోనే ఏర్పాట్లు ఆరంభించినా, లోక్సభ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది డిసెంబరులోనే సర్పంచి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 200 మంది ఓటర్లకు ప్రిసైడింగ్ అధికారితో పాటు పోలింగ్ అధికారి ఉంటారు. 201- 400 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401- 650 వరకు ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులు, 650 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు రావడంతో, జూన్ ఆఖరు నాటికి ఎన్నికలు నిర్వహించనున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాత విధానమేనా..?: జిల్లాలోని 20 మండలాల్లో 566 పంచాయతీలకు 2019 జనవరిలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. గత ఫిబ్రవరి 1 నుంచి పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం ఉండేలా గత ఎన్నికల్లోనే నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాత విధానాన్నే కొనసాగిస్తారా? ఏవైనా మార్పులు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పాత విధానమే అమలు చేస్తే మరోమారు గతంలో ఉన్న సర్పంచులు బరిలో నిలువనున్నారు. బీసీ ఓటర్ల సంఖ్య పెరగడంతో రిజర్వేషన్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు పంచాయతీరాజ్శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 18 జడ్పీటీసీ, 221 ఎంపీటీసీ స్థానాలున్నాయి. జులై 4న పదవీకాలం ముగియనుంది. వీటికి కూడా సర్పంచులకు మాదిరిగానే రెండు పర్యాయాలు రిజర్వేషన్ అమల్లో ఉంది. రెండు మాసాల వ్యవధిలో సర్పంచి, ప్రాదేశిక ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులు ఇప్పటికే ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు.
సిద్ధంగా ఉన్నాం..: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ చెపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్, లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల అధికారుల నియామకం తదితర ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బీమా బైపాస్ సర్జరీతో సమస్యలు స్వల్పం’
[ 03-06-2024]
బీమా బైపాస్ శస్త్రచికిత్సతో(బైలటేరియల్ ఇంటర్నల్ మమ్మరీ ఆర్టరీ-బీఐఎంఏ) అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఉంటాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం.. -
హోటల్లో ఉరేసుకుని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి..
[ 03-06-2024]
హోటల్ గదిలో ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్సై రవికుమార్లు తెలిపిన వివరాల ప్రకారం. -
భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఆత్మహత్య
[ 03-06-2024]
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/24)
-
టీ20 ప్రపంచకప్.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్