దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.
అక్కడి ప్రచారానికి తరలివెళ్లిన నగర నాయకులు
ఈనాడు, హైదరాబాద్: నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ పరిస్థితిలో గత ఆదివారానికి, ఈ వారానికి ఎంతో తేడా కనిపించింది. గత సోమవారం ఎన్నికలు జరగడంతో అంతకు ముందు రోజు ఆదివారం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠకు గురయ్యారు. కంటిపై కునుకు లేకుండా ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఈ ఆదివారం పలువురు అభ్యర్థులు ఓట్ల లెక్కల్లో నిమగ్నమయ్యారు. ఓట్లు ఎక్కడ ఎన్ని పడతాయో ముఖ్య నాయకులతో చర్చిస్తూ అంచనాలు వేసుకోవడం కనిపించింది.
చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కోల్కతాలో పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా.. సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి గత కొన్ని రోజులుగా ఉత్తరాది ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. సికింద్రాబాద్ కాంగ్రెస్, భారాస అభ్యర్థులు దానం నాగేందర్, పద్మారావు గౌడ్ ఇళ్లకే పరిమితమై ఓటింగ్ సరళిపై సమీక్షించారు. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ భారాస, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇళ్లకే పరిమతమయ్యారు. చేవెళ్ల కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ఉదయం నుంచి లెక్కల్లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన అసదుద్దీన్ ఒవైసీ ఇక్కడ ఎన్నికలైన మరుసటి రోజే ఉత్తర భారతంలో ప్రచారానికి వెళ్లారు. ఇదే నియోజకవర్గం భాజపా అభ్యర్థి మాధవీలత సైతం అక్కడి ప్రచారంలో ఉన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక అభ్యర్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
ముఖ్య నాయకులతో కలిసి అంచనాలు..
గత సోమవారం ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అభ్యర్థులు నియోజకవర్గాలవారీగా ఓట్లశాతాలను అంచనా వేసుకుని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. నగరంలో తమ పార్టీకి ఉన్న బలంపై భారాస..దేశ వ్యాప్తంగా మోదీకి ఉన్న సానుకూలతపై భాజపా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్..ఇలా మూడు పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్య నాయకులతో కూర్చొని డివిజన్ల వారీగా అంచనాకు వస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్