ద్విచక్ర వాహనం నుంచి పడి గృహిణి మృతి
స్పీడ్బ్రేకర్ వద్ద భర్త ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సెక్రటేరియట్ పోలీసుస్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. బేగంపేట్ రసూల్పురాలో నివాసం ఉంటున్న ఫాతిమా (30), ఫయాజ్లు భార్యాభర్తలు.
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: స్పీడ్బ్రేకర్ వద్ద భర్త ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సెక్రటేరియట్ పోలీసుస్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. బేగంపేట్ రసూల్పురాలో నివాసం ఉంటున్న ఫాతిమా (30), ఫయాజ్లు భార్యాభర్తలు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం మధ్యాహ్నం నక్లెస్రోడ్డుకు వచ్చారు. అదే రోడ్డులో వెళ్తుండగా.. స్పీడ్బ్రేకర్ వద్ద ద్విచక్రవాహనం ఒక్కసారిగా ఎగరడంతో ఆమె ఆదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో గాయపడిన ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు చెప్పారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నాలుగో అంతస్తు నుంచి కిందపడి కార్మికుడి దుర్మరణం
పటాన్చెరు, న్యూస్టుడే: భవన నిర్మాణ పనుల్లో ఉన్న ఓ కార్మికుడు నాలుగో అంతస్తునుంచి కింద పడి దుర్మరణం పాలైన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సోమేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం బిర్భూమి జిల్లా బెలేవరి గ్రామానికి చెందిన అరుణ్లెట్(22) అమీన్పూర్ పురపాలక పరిధి పీజేఆర్ ఎన్క్లేవ్ కాలనీలో తేజ్రామ్ అనే బిల్డర్ వద్ద కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం బహుళ అంతస్తుల భవన నిర్మాణంలో భాగంగా నాలుగో అంతస్తుకు ఇటుకలు మోస్తుండగా కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బిల్డర్ తేజ్రామ్ భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోలేదంటూ బంధువు రంజన్ మహల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
టిప్పర్ ఢీకొని ఒకరికి గాయాలు
పటాన్చెరు అర్బన్, న్యూస్టుడే: టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం సర్వీస్ రహదారి పోచారం కూడలి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న కొండాపూర్ మండలం ఉత్తరపల్లికి చెందిన మహేందర్ను సోమవారం రాత్రి టిప్పర్ బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది శ్రీశాంత్ తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడినుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆభరణాలు ఎత్తుకెళ్లారని భార్య, అత్తమామలపై ఫిర్యాదు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: తన భార్య, అత్తమామలు కలిసి కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని భర్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణ పటేల్ గుజరాత్కు చెందిన వైష్ణవిని 2020లో వివాహం చేసుకొని కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 70లో నివసిస్తున్నాడు. పెళ్లైన కొద్ది వారాలకే భార్య ఖరీదైన బట్టలు, ఆభరణాలు, కారు కావాలంటూ గొడవ చేసింది. ఈ క్రమంలో విభేధాలు రావడంతో రామకృష్ణ వేరే ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. భార్యభర్తల పేరుతో జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో లాకర్ ఉండగా అందులో ఆభరణాలను పెట్టారు. 2022లో భార్య లాకర్లో పెట్టిన దాదాపు రూ.కోటిన్నర విలువైన ఆభరణాలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. రామకృష్ణ కోర్టును ఆశ్రయించడంతో 17వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది.
ప్రయాణికులతో దురుసు ప్రవర్తన.. ట్రావెల్స్ యజమానిపై కేసు
రామచంద్రాపురంరూరల్, న్యూస్టుడే: ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్లు, ట్రావెల్స్ యజమానిపై కేసు నమోదైంది. రామచంద్రాపురం ఎస్ఐ శశికాంత్రెడ్డి తెలిపిన వివరాలివీ.. నగరానికి చెందిన హేమంత్, అతడి స్నేహితుడు ప్రవీణ్లు గోవా వెళ్లేందుకు సోమవారం ఓ యాప్లో టికెట్ బుక్ చేసుకున్నారు. మియాపూర్లో రాత్రి 10గంటలకు, బుక్ చేసుకున్న బస్సుకు బదులుగా శ్రీట్రావెల్స్కు చెందిన మరో బస్సులో తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులతో ఎక్కారు. తరువాత దుర్వాసన వస్తోందని డ్రైవర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో డ్రైవర్ మధు, సహాయ డ్రైవర్ రాములు ప్రయాణికులతో దురుసుగా మాట్లాడారు. ఈ విషయం బస్ యజమాని సునీల్కు ఫోన్లో చెప్పినా పట్టించుకోలేదు. బాధితులు అశోక్నగర్ వద్ద బస్సు ఆపి 100 నంబరుకు ఫిర్యాదు చేశారు. రామచంద్రాపురం పోలీసులు వచ్చేలోపే ఇద్దరు డ్రైవర్లు బస్ వదిలి పరారయ్యారు. ఈ మేరకు ఇద్దరు డ్రైవర్లు, బస్ యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
మంచి దొంగ!
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
అతివేగం.. తీసింది ఇద్దరి ప్రాణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ పిల్మ్సిటీలో ప్రెండిషిప్ వీక్
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?