వేసవి శిబిరాలు.. సృజనకు సోపానాలు
వేసవి సెలవుల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తోంది.
స్కేటింగ్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: వేసవి సెలవుల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. దీని పరిధిలోని 366 క్రీడా మైదానాలు, 730 కేంద్రాల్లో 44 క్రీడాంశాలతో శిబిరాలు నిర్వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటిన 826 మంది మాజీలు, సీనియర్ క్రీడాకారులను శిక్షకులుగా ఎంపిక చేశారు. 6-16 ఏళ్ల పిల్లలకు ఉదయం 6-9, సాయంత్రం 3-6 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు.
నామమాత్ర రుసుముతో.. శిబిరాల్లో నామమాత్రపు రుసుముతో చిన్నారులకు తర్ఫీదు ఇస్తున్నారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్కే మార్షల్ ఆర్ట్స్తో పాటు చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈత వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు చిన్నారులకు ఈత నేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాసబ్ ట్యాంక్ విజయనగర్ కాలనీలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్సులోని ఈత కొలనుకి నిత్యం 500 మంది చిన్నారులు వెళ్తున్నారు. ప్రైవేటులో నెలకు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తుండటంతో బల్దియా ఆధ్వర్యంలోని ఈత కొలనులను ఆశ్రయిస్తున్నారు. కరాటే శిక్షణ తీసుకుంటున్నవారిలో బాలికలు ఎక్కువగా ఉన్నారు. నెలకు రూ.20తో కరాటే నేర్పుతున్నారు.
కరాటేలో ప్రావీణ్యం సంపాదిస్తూ..
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ
గత 30 ఏళ్లుగా చిన్నారులకు, పెద్దలకు కరాటే శిక్షణ ఇస్తున్నాను. తమ పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. విజయనగర్ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్సుకు సాధారణ రోజుల్లో 30 మంది చిన్నారులు కరాటే శిక్షణకు వచ్చేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 50కి చేరింది. చాలా మంది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఎ.ఎం.యాదవ్, జీహెచ్ఎంసీ కరాటే కోచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
[ 26-07-2024]
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత శనివారం తిరిగి సమావేశం కానుంది. -
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
[ 26-07-2024]
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
[ 26-07-2024]
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM