అయిదేళ్లుగా ఆగుతూ.. సాగుతూ..
వర్షాకాలంలో ప్రజలను ముంపు బాధ నుంచి తప్పించి ప్రయాణం సాఫీగా సాగేందుకు సర్కారు వంతెన మంజూరు చేసింది.
ప్రజలకు తప్పని తిప్పలు
బిజ్వార్ వద్ద నదిని దాటాల్సిందే..
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ: వర్షాకాలంలో ప్రజలను ముంపు బాధ నుంచి తప్పించి ప్రయాణం సాఫీగా సాగేందుకు సర్కారు వంతెన మంజూరు చేసింది. దానికి అనుసంధానంగా రహదారి నిర్మించాలని సంకల్పించింది. ఇందుకోసం నిధులు విడుదల చేసింది. అయిదేళ్లు గడిచినా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏడాదిగా ఎక్కడికక్కడే అన్నట్లుగా ఉండడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు.
అసంపూర్తిగా వదిలేసి: తాండూరు మండలం గోనూరు వద్ద కాగ్నా నది వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు నది దాటుకుని రాకపోకలు సాగించేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. వరద ప్రవాహం అధికంగా ఉంటే ప్రయాణం మానుకోవాలి, లేదంటే యాలాల మండలం అగ్గనూరు, లక్ష్మీనారాయణ్పూర్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. అత్యవసర సమయంలో వైద్యం పొందేందుకు వీళ్లేక అవస్థలు ఎదుర్కొవాల్సిన దుస్థితి. దశాబ్దాలుగా నెలకొన్న సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వంతెన, రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5.62 కోట్లు మంజూరు చేసింది. వాటితో పనులు చేపట్టిన గుత్తేదారు కాగ్నా నదిలో వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెనకు అనుసంధానంగా రెండు వైపులా కి.మీ.పొడవునా సిమెంటు రహదారి నిర్మించాల్సి ఉండగా పనులు మధ్యలో వదిలేశారు. ఏడాదిన్నరగా పనులు చేపట్టడం లేదు. వర్షాకాలంలో వరద ప్రవాహం కొనసాగడంతో గత్యంతరంలేక గ్రామస్థులు వంతెనకు రెండువైపులా నాపరాయి వ్యర్థాలు, ఇసుక, ఎర్రమట్టి మొరం కుమ్మరించి తాత్కాలిక రహదారిగా చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలకు వరద పెరిగితే నాపరాయి వ్యర్థాల దారి తుడిచిపెట్టుకుపోయే ఆస్కారముంది. దీంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామస్థులకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అసంపూర్తి పనులు పూర్తి చేయించాల్సి ఉంది. వంతెనకు ఇరువైపులా సిమెంటు రోడ్డు నిర్మించి అందుబాటులోకి తేవాలని గోనూరు, వీర్శెట్టిపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.
పనులు పూర్తి కాకపోవడంతో ఇలా..
రూ.3.50 కోట్లు మంజూరు చేసినా.. : బిజ్వార్ అనుబంధ గ్రామమైన బొంకూరుకు వెళ్లాలంటే నది దాటాల్సిందే. నదిలోంచి ప్రయాణం సాగిస్తేనే బొంకూరు చేరే వీలుంది. వర్షాకాలంలో వరద ప్రవాహం పెరిగితే గ్రామస్థులు ఇళ్లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సెలవు పెట్టాల్సిందే. నది దాటలేక సకాలంలో వైద్యం అందక ఏడాది కిందట ఆరో తరగతి విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఉండేందుకు కాగ్నా నదిలో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది రూ.3.50కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు పనులు మొదలు కాలేదు. టెండరు ప్రక్రియ పూర్తి చేసి వంతెన నిర్మిస్తే బొంకూరు గ్రామస్థులు వానా కాలంలోనూ ప్రయాణం సాగించే వీలుంటుంది. అధికారులు దృష్టిసారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
[ 26-07-2024]
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు