ఒక మైదానం.. 10 క్రికెట్ జట్లు
నగరమంతా ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇక చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. అందుకే ఎక్కడ చూసినా చిన్నారులు క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు. ఒకరు ఫోరు కొడితే.. ఇంకొకరు సిక్సు బాదేస్తున్నారు.
ప్రమాదకరంగా చిన్నారుల క్రీడలు
ఈనాడు, హైదరాబాద్
- ఒకే క్రీడా మైదానం.. అందులో 10 జట్లు వేర్వేరుగా క్రికెట్ ఆడుతుంటాయి.
- ఒక జట్టేమో క్వార్క్ బాల్తో ఆడుతుంది.
- మరో జట్టు గట్టిగా ఉన్న రబ్బరు బాలుతో ఆడుతుంటుంది.
- ఇలా ఎవరి బంతి ఎవరికి తగులుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి.
- సేఫ్టీగార్డ్స్, హెల్మెట్లు ధరించినా ఒక్కోసారి ఊహించని ప్రమాదం.
- 2001 నుంచి 2016 మధ్య కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని జరుగుతున్న క్రికెట్ పోటీలో 83 మంది చనిపోగా..వీధులు, బీచ్లు, పాఠశాలల్లో క్రికెట్ ఆడుతూ 91 మంది చనిపోయారని ఆస్ట్రేలియాకు చెందిన మెడికల్ జర్నల్ వివరించంది.
నగరమంతా ఐపీఎల్ క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇక చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. అందుకే ఎక్కడ చూసినా చిన్నారులు క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు. ఒకరు ఫోరు కొడితే.. ఇంకొకరు సిక్సు బాదేస్తున్నారు. ఔటైనా అంతే కేరింతలు.. ఆ చిన్న క్రీడా మైదానం సందడితో ఊగిపోతుంది. క్రీడా మైదానంలో పిల్లలు ఆడుతుంటే ఆ కేరింతలు చూసి తరించాల్సిందే. కానీ అలా అయిదు నిమిషాలు వారి ఆటను చూస్తే.. ఎంత ప్రమాదకరమో ఇట్టే అర్థమైపోతుంది. ఎవరి క్రికెట్ బాల్ ఎవరికి తగులుతుందో తెలియని గందరగోళం. సేఫ్టీ గార్డులుండవు.. హెల్మెట్లు పెట్టుకోరు.. వారికి ఉన్న ఒకే ఒక్క కసి.. బౌలింగ్ చేసినప్పుడు బాల్ను గట్టిగా విసరడం.. బ్యాటర్ దానిని బలంగా బాదడం.. ఏ ఒక్కరూ తగ్గేదే లే అనేట్లు ఆడేస్తున్నారు. క్రికెట్ మైదానంలో ఇద్దరు బ్యాటర్లు, ఒక బౌలర్, ఒక కీపర్, 8 మంది ఫీల్డర్లు ఉంటే కొంతవరకు ఫర్వాలేదు. కానీ 1000 నుంచి 1500 మీటర్ల వైశాల్యంలో ఉన్న క్రీడా మైదానంలో ఏకంగా 10 జట్లు ఎవరికి వారు ఆడితే ఎంత ప్రమాదమో ఊహించవచ్చు.
నగరంలో క్రీడా మైదానాల కొరత..
625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీలో 521 క్రిడా మైదానాలు ఉన్నాయి. ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి క్రీడా మైదానం.. ఇలా వీటిని పరిగణనలోకి తీసుకోకుండా మిగిలినవి 521 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయో..ఎన్ని కుంచించుకుపోయాయో తెలియని పరిస్థితి. మణికొండలోని మర్రిచెట్టు వద్ద ఉన్న క్రీడామైదానం, పరేడ్ మైదానంలో ఆదివారం వస్తే క్రికెట్ క్రీడాకారులతో కిటకిటలాడతాయి. వేసవి సెలవులు చివరికి రావడంతో పాటు కాస్త వాతావరణం చల్లగా మారడంతో చిన్నారులు క్రికెట్ ఆడుతూ గడుపుతున్నారు. ప్రతి కాలనీకి కాకపోయినా.. 5 కిలోమీటర్లకు ఒక క్రీడామైదానం ఉంటే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పుడు 15 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉండడం, అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నగరంలో చిన్నారుల క్రీడలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి.
నైపుణ్యం మెరుగయ్యేదెలా..?
కోటి దాటిన నగర జనాభాలో జాతీయ జట్టులో తగిన ప్రాధాన్యం ఉండడం లేదు. వీధుల్లో, దగ్గర్లోని ఖాళీ ప్రదేశాల్లో క్రికెట్ ఆడుతూ చిన్నారులు క్రీడానైపుణ్యం ప్రదర్శించలేకపోతున్నారు. పన్నులు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీకి నగరపౌరులకు అన్ని సౌకర్యాలూ కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరీ ముఖ్యంగా చిన్నారుల క్రీడా జీవితాన్ని జీహెచ్ఎంసీ దెబ్బతిస్తోంది. వేసవి శిబిరాల పేరిట తూతూ మంత్రంగా క్రీడలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటోంది. పిల్లల ఆటలకు అనువైన వాతావరణం నగర వ్యాప్తంగా కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి